Pakistan: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్కు తాత్కాలిక సభ్యత్వం..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలట్లో పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు విజయం సాధించాయి. 193 సభ్య దేశాలు గల ఐరాస జనరల్ అసెంబ్లీ ఈ అయిదు దేశాలను ఎంపిక చేయడం లాంఛనమే అయింది. భద్రతా మండలిలో మొత్తం 15 సీట్లు ఉండగా.. వాటిలో అయిదు వీటో అధికారం గల శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. మిగతా 10 దేశాలను రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్యులుగా ఎన్నిక చేయనున్నారు. ఈ సీట్లను ప్రాంతాల వారీగా కేటాయిస్తారు.
Read Also: TGSRTC: ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బస్ పాస్ ధరలు
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
ఇక, ఈసారి ఆఫ్రికా బృందం సోమాలియాను ప్రతిపాదించగా.. ఆసియా-పసిఫిక్ దేశాల తరఫున పాకిస్థాన్ను ఎంపిక చేశారు. లాటిన్ అమెరికా, కరేబియన్ గ్రూపు పనామా పేరును ప్రతిపాదించగా.. డెన్మార్క్, గ్రీస్లు ఐరోపా తరఫున నామినేట్ అయ్యాయి. ఈ కొత్త తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం 2025 జనవరి 1వ లేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. కాగా, ప్రస్తుత తాత్కాలిక సభ్య దేశాలు జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, స్విట్జర్లాండ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన ముగియనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని 21వ శతాబ్ది అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తరించాలని భారత్తో సహా అన్ని సమితి సభ్య దేశాలు కోరుతున్నా ఇంత వరకు అడుగు ముందుకు మాత్రం పడటం లేదు.
Read Also: Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. ఆప్ మంత్రి స్పష్టం
ఇక, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యు దేశంగా ఎన్నికైనందుకు సంతోషం వ్యక్తం చేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇది గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేసేందుకు పాకిస్థాన్ ఆసక్తిగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్థిరత్వం, సహకారాన్ని పెంపొందించడంలో మేము మా పాత్రను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ తెలిపారు.
తాజావార్తలు
-
Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
-
LSG vs KKR: కోల్కతాపై పంజా విసిరిన మోసిన్ ఖాన్.. దంచికొట్టిన రింకూ.. లక్నో టార్గెట్ ఎంతంటే?
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!