Gopal Rai: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు.. ఆప్ మంత్రి స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ గురువారం ధృవీకరించింది. లోక్సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరదని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన తర్వాత.. ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 55 సీట్లు గెలుస్తామని దక్షిణ ఢిల్లీ నుంచి కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీ రాంబీర్ సింగ్ బిధురి ప్రకటించారు. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 52 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించిందన్నారు.
READ MORE: UP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో కలకలం.. రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ రాజీనామా!
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
2025లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను కోరారు. లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఢిల్లీలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. ఆప్ శనివారం (జూన్ 8) ఢిల్లీ కౌన్సిలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయగా, పార్టీ కార్యకర్తల సమావేశం జూన్ 13న జరగనుంది.
కాగా.. ఐదు రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్, గుజరాత్, అస్సాంలోని 22 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో మూడు లోక్సభ స్థానాలను గెలుచుకోగలిగింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. పంజాబ్లో ఇటీవల ప్రకటించిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ రాష్ట్రంలోని 13 లోక్సభ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్తో డార్లింగ్ ఫ్యాన్స్లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!