Champions Trophy 2025: ఈ దెబ్బతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
- ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ కోల్పోనుందా?
- ట్రోఫీ కోసం సిద్ధం కానీ స్టేడియంల నిర్మాణాలు.
- ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఒక పెద్ద సమస్య ఎదురవుతోంది. ప్రపంచ క్రీడ ప్రపంచంలో పాకిస్థాన్ అవమానకరంగా నిలిచే అవకాశం రాబోతుంది. పాకిస్థాన్ త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్యం కొనసాగించడం లేదా తప్పించడం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. అయితే, ఇందుకు పాకిస్థాన్ లోని మూడు ప్రధాన క్రికెట్ స్టేడియాలు లాహోర్, రావల్పిండి, కరాచీలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. ఈ మూడు స్టేడియాలు ఇప్పటికే అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధం కావాల్సి ఉంది. అయితే, గడాఫీ స్టేడియం వంటి కొన్ని ప్రధాన వేదికలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ఈ వేదికలపై నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్లు, షెడ్లు, అభిమానుల కోసం కుర్చీలు వంటి అంశాలు సన్నాహాలు చేయాల్సి ఉన్నాయి.
Also Read: Martin Guptill: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పేసిన మరో స్టార్ ప్లేయర్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, వచ్చే వారం ఐసీసీ అధికారులు పాకిస్థాన్లోని వేదికలను తనిఖీ చేయనున్నారు. అయితే, ఇదివరకే పీసీబీకి సరైన సమయానికి వేదికలు సిద్ధం చేసేందుకు గడువు ఇచ్చారు. అయితే, ఈ గడువును మించితే ఐసీసీ నిర్ణీత చెక్లిస్ట్ ప్రకారం వేదికలు సిద్ధంగా లేకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం పాకిస్థాన్ నుండి దూరం చేయవచ్చు. అప్పుడు, టోర్నీ మొత్తం యూఏఈలో నిర్వహించబడుతుంది.
Also Read: Aggressive Elephant: ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు
Gaddafi Stadium (yesterday)
Finishing deadline 25 January #ChampionsTrophy2025 pic.twitter.com/JcI32tZZ3K— Sohail Imran (@sohailimrangeo) January 7, 2025
ఇక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీతో పెద్ద యుద్ధాన్ని చేసిన సంగతి తెలిసిందే. భారత్తో క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు పీసీబీ దర్యాప్తు చేసినా, బీసీసీఐ అందుకు నిరాకరించింది. ఆ తరువాత, పీసీబీ హైబ్రిడ్ మోడల్ను అంగీకరించి.. టీమిండియా మ్యాచ్ లు దుబాయ్లో ఆడేలా నిర్ణయించుకుంది. ఇప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ యూఏఈకి మారితే.. పాకిస్థాన్ ప్రతిష్టను మరింతగా బలహీనపర్చే అవకాశం ఉంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందు ఉన్న సవాళ్లు, నిర్మాణ పనులలో ఆలస్యం, అంతర్జాతీయ క్రికెట్ సమాజంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే పాకిస్థాన్కు ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు కోల్పోవడం అనేది పెద్ద విషయమే అవుతుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..