Site icon NTV Telugu

Khawaja Asif: పాక్-ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత.. భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి సంచలన ఆరోపణలు..

Khawaja Asif

Khawaja Asif

Khawaja Asif: పాకిస్థాన్ వక్ర బుద్ధి మారడం లేదు. తమ దేశంపై ఎవరు దాడి చేసినా.. ఎక్కడ ఏం జరిగినా దీనికి కారణం భారత్‌ అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం దాయాది దేశానికి కామన్‌గా మారిపోయింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంలో భారత్ జోక్యం ఉందంటూ మరోసారి ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్రాన్స్ 24 ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్థాన్‌పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయన్నారు. ఆఫ్ఘన్లు దాడులు చేసేలా భారత్ ప్రేరేపించిందన్నారు. కానీ.. ఈ అంశాన్ని భారత్ అంగీకరించదని.. ఎందుకంటే కాబూల్‌తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ నుంచి పాకిస్థాన్ పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటోందనన్నారు. ఆప్ఘన్‌ భారత్‌కు వలస రాజ్యంగా వ్యవహరిస్తోందని, ఈ అంశంపై తమతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. వారి మిత్రత్వం అనుమానంగా ఉందన్నారు.

READ MORE: Tanishk Bagchi: బాలీవుడ్ అన్యాయంపై.. తనిష్క్ బాగ్చి సంచలన వ్యాఖ్యలు..!

ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి మరోసారి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగారు. పాకిస్థాన్ అఫ్ఘాన్‌పై ఒక్కసారిగా వైమానిక దాడులకు పాల్పడింది. దీనికి పాక్ ‘ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌’గా పేరు పెట్టింది. కాబుల్‌, కాందహార్‌, పక్తియా ప్రావిన్స్‌లలో పాక్ వైమానిక దాడులు జరిపింది.. మరోవైపు.. ఆఫ్ఘాన్‌ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతమయ్యారు.. మరికొందరిని బంధీలుగా తీసుకుంది ఆఫ్ఘాన్.. సరిహద్దుల్లో పాక్ సైనిక శిబిరాలపై భారీ దాడులు నిర్వహించింది.. 13 అవుట్ పోస్టులు స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘాన్ ప్రతినిధుల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో దాడులను పాకిస్థాన్ ధృవీకరించింది.

READ MORE: India vs West Indies: కెప్టెన్ సూర్య చేసిన బిగ్ మిస్టెక్‌ వల్ల భారీ మూల్యం.. వర్షం పడితే భారత్ ఇంటికే..!

Exit mobile version