Pakistan: పాక్ వైమానిక దాడులు.. 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు దేశంపై పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకొంది. ఆఫ్ఘనిస్తాన్లో రెండు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.ఆఫ్ఘనిస్తాన్ ముష్కరులకు ఆశ్రయం కల్పిస్తుందన్న సాకుతో పాకిస్థాన్ వైమానికి దాడులకు తెగబడింది. రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ రెండు దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ చర్యను ఆప్ఘనిస్తాన్ ప్రతినిధి ఖండించారు. ఈ చర్య తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయలేక మమ్మల్ని నిందించడం తగదని తెలిపింది. అక్కడి ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొందని.. ఇలాంటి చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆప్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఈ విషయంలో ఇస్లామిక్ ఎమరేట్ ఆఫ్ అఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం ఏమాత్రం రాజీ పడదని పేర్కొంది. తూర్పు ప్రావిన్స్లోని ఖోస్ట్, పాక్టికలో సోమవారం పాకిస్థాన్ విమానాలు దాడులు నిర్వహించింది. ఇప్పటికే పాక్-ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ దాడులు జరగడం మరింత ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తోంది.
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
ఇది కూడా చదవండి: Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం..
పాకిస్థాన్లోని ఖైబర్ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. వీరి అంత్యక్రియల సందర్భంగా పాక్ అధ్యక్షుడు జర్దారీ స్పందిస్తూ కచ్చితంగా తమ వీరుల త్యాగాలు వృథాగా పోవని ప్రతిజ్ఞ చేశారు. టీటీపీ ఉగ్రవాదులే ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంస్థను ఆప్ఘనిస్థాన్ భూభాగం కేంద్రంగా నడిపిస్తున్నారు. మొత్తానికి సోమవారం పాక్ ప్రతీకార చర్యలకు పూనుకుంది.
ఇటీవల పాక్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నవాజ్ షరీఫ్-భుట్టో పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. జర్దారీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!