India Pakistan Tension: భారత పైలట్ ఎవరూ మా అదుపులో లేరు.. మా యుద్ధ విమానం దెబ్బతింది..
- భారత పైలట్ ఎవరూ మా అదుపులో లేరు
- మా యుద్ధ విమానం దెబ్బతింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. వీరిలో పుల్వామా దాడిలో పాల్గొన్న యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించారు. దీని ఫలితంగా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
Also Read:Kollywood : సీక్వెల్స్ కింగ్ గా మారిన యంగ్ హీరో
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఆదివారం రాత్రి పాకిస్తాన్ నేవీ, వైమానిక దళం, ఆర్మీ అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, భారతదేశంతో జరిగిన ఘర్షణలో తమ విమానం దెబ్బతిన్నట్లు అంగీకరించారు. అయితే, ఏ విమానం దెబ్బతిన్నదో లేదా దాని పేరు ఏమిటో పాకిస్తాన్ వెల్లడించలేదు. విలేకరుల సమావేశంలో, పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధిని, భారత పైలట్లలో ఎవరైనా పాకిస్తాన్ అదుపులో ఉన్నారా అని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా భారత పైలట్లు ఎవరూ పాకిస్తాన్ అదుపులో లేరని వెల్లడించారు.
Also Read:Naveen Chandra : సినిమా నచ్చకుంటే..మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాం
26 భారత సైనిక స్థావరాలపై దాడి చేశాం
పాకిస్తాన్ 26 భారత సైనిక స్థావరాలపై దాడి చేసిందని లెఫ్టినెంట్ చౌదరి పేర్కొన్నారు. ఇందులో వైమానిక దళం, వైమానిక స్థావరాలు ఉన్నాయన్నారు. సూరత్గఢ్, సిర్సా, భుజ్, నాలియా, అధంపూర్, బటిండా, బర్నాలా, హల్వారా, అవంతిపురా, శ్రీనగర్, జమ్ము, ఉధంపూర్, మామున్, అంబాలా, పఠాన్కోట్లోని భారత సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. అంతేకాకుండా, బియాస్, నగ్రోటాలోని బ్రహ్మోస్ క్షిపణి నిల్వ కేంద్రాలపై కూడా దాడి జరిగిందని ఆరోపించారు.
Also Read:Zelensky: యుద్ధాన్ని ముగించేందుకు “పుతిన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను”.. జెలెన్స్కీ సంచలన పోస్ట్.!
ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించింది.
ఆపరేషన్ సిందూర్లో లష్కరే తాయిబా, జైషే మహ్మద్కు చెందిన ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా, ముదస్సర్ ఖడ్యాన్, మహ్మద్ రసమ్ ఖాన్, హఫీజ్ మహ్మద్ జమీల్ సహా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఉండటం పాకిస్తాన్ వక్ర బుద్దిని బయటపెట్టింది. పాకిస్తాన్ DGMO అభ్యర్థన మేరకు, మే 10న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారతదేశం అంగీకరించింది. కానీ “ఉగ్రవాదాన్ని యుద్ధంగా పరిగణిస్తాము”.. సింధు జల ఒప్పందం రద్దు చేశామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తో నేడు (సోమవారం) డీజీఎంఓ స్థాయి చర్చలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!