India Pakistan Tension: భారత పైలట్ ఎవరూ మా అదుపులో లేరు.. మా యుద్ధ విమానం దెబ్బతింది..
- భారత పైలట్ ఎవరూ మా అదుపులో లేరు
- మా యుద్ధ విమానం దెబ్బతింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. వీరిలో పుల్వామా దాడిలో పాల్గొన్న యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించారు. దీని ఫలితంగా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
Also Read:Kollywood : సీక్వెల్స్ కింగ్ గా మారిన యంగ్ హీరో
Also Read
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
ఆదివారం రాత్రి పాకిస్తాన్ నేవీ, వైమానిక దళం, ఆర్మీ అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, భారతదేశంతో జరిగిన ఘర్షణలో తమ విమానం దెబ్బతిన్నట్లు అంగీకరించారు. అయితే, ఏ విమానం దెబ్బతిన్నదో లేదా దాని పేరు ఏమిటో పాకిస్తాన్ వెల్లడించలేదు. విలేకరుల సమావేశంలో, పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధిని, భారత పైలట్లలో ఎవరైనా పాకిస్తాన్ అదుపులో ఉన్నారా అని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా భారత పైలట్లు ఎవరూ పాకిస్తాన్ అదుపులో లేరని వెల్లడించారు.
Also Read:Naveen Chandra : సినిమా నచ్చకుంటే..మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాం
26 భారత సైనిక స్థావరాలపై దాడి చేశాం
పాకిస్తాన్ 26 భారత సైనిక స్థావరాలపై దాడి చేసిందని లెఫ్టినెంట్ చౌదరి పేర్కొన్నారు. ఇందులో వైమానిక దళం, వైమానిక స్థావరాలు ఉన్నాయన్నారు. సూరత్గఢ్, సిర్సా, భుజ్, నాలియా, అధంపూర్, బటిండా, బర్నాలా, హల్వారా, అవంతిపురా, శ్రీనగర్, జమ్ము, ఉధంపూర్, మామున్, అంబాలా, పఠాన్కోట్లోని భారత సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. అంతేకాకుండా, బియాస్, నగ్రోటాలోని బ్రహ్మోస్ క్షిపణి నిల్వ కేంద్రాలపై కూడా దాడి జరిగిందని ఆరోపించారు.
Also Read:Zelensky: యుద్ధాన్ని ముగించేందుకు “పుతిన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను”.. జెలెన్స్కీ సంచలన పోస్ట్.!
ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించింది.
ఆపరేషన్ సిందూర్లో లష్కరే తాయిబా, జైషే మహ్మద్కు చెందిన ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా, ముదస్సర్ ఖడ్యాన్, మహ్మద్ రసమ్ ఖాన్, హఫీజ్ మహ్మద్ జమీల్ సహా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఉండటం పాకిస్తాన్ వక్ర బుద్దిని బయటపెట్టింది. పాకిస్తాన్ DGMO అభ్యర్థన మేరకు, మే 10న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారతదేశం అంగీకరించింది. కానీ “ఉగ్రవాదాన్ని యుద్ధంగా పరిగణిస్తాము”.. సింధు జల ఒప్పందం రద్దు చేశామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తో నేడు (సోమవారం) డీజీఎంఓ స్థాయి చర్చలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!