Zelensky: యుద్ధాన్ని ముగించేందుకు “పుతిన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను”.. జెలెన్స్కీ సంచలన పోస్ట్.!
- X ద్వారా జెలెన్స్కీ సంచలన పోస్ట్..
- యుద్ధాన్ని ముగించేందుకు "పుతిన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను".
- మే 16న (గురువారం) టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఎదురుచూస్తానని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మే 16న (గురువారం) టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగే చర్చల కోసం పుతిన్ రాక కోసం ఎదురుచూస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రకటనను జెలెన్స్కీ తాజాగా “ఎక్స్” లో పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాతో వెంటనే చర్చలకు ఒప్పుకోవాలని సూచించిన వెంటనే ఈ ప్రకటన వెలువడింది.
Read Also: Diamond League: నీరజ్ చోప్రా నేతృత్వంలో రంగంలోకి నలుగురు అథ్లెట్లు..!
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం సోమవారం నుంచే పూర్తి స్థాయి యుద్ధ విరమణ ప్రారంభమవుతుందని ఆశిస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇది ద్వైపాక్షిక చర్చలకు సరైన వాతావరణాన్ని ఏర్పరచడమే లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు. యుద్ధానికి ముగింపు కావాలంటే రాజనీతిక పరిష్కారాలు తప్పవు. అందుకే గురువారం టర్కీలో పుతిన్ను కలవడానికి నేను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ తన పోస్ట్ లో స్పష్టం చేశారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి ఇంత స్పష్టమైన శాంతి చర్చల ప్రకటన ఇదే తొలిసారి కావచ్చు. ఈ ప్రకటనతో యుద్ధం ముగియాలన్న అంతర్జాతీయ ప్రయత్నాలకు కొత్త ఊపొచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అనేక దేశాలు మద్యవర్తిత్వానికి ముందుకొచ్చినప్పటికీ, మౌలిక సమస్యలపై రెండు దేశాలు ఒప్పందానికి రాలేదు. భూభాగాల ఆక్రమణ, నాటో సభ్యత్వం, భద్రతా హామీలు వంటి అంశాలపై తీవ్ర విభేదాలున్నాయి. గతంలో టర్కీ, ఇజ్రాయెల్, బెలారస్ వంటి దేశాలు చర్చల వేదికలుగా ప్రయత్నించాయి కానీ.. అనూహ్యంగా శాంతి ఒప్పందాలు జరగలేదు.
Read Also: Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ సిబ్బంది.. పేర్లను విడుదల చేసిన భారత్
టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్, యుద్ధ ప్రారంభం నుండి రెండు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. గతంలో అనేక సందర్భాల్లో టర్కీ మద్యవర్తిత్వం ద్వారా ఖైదీ మార్పిడి, ధాన్య సరఫరా ఒప్పందాలను సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఇస్తాంబుల్ను చర్చల వేదికగా జెలెన్స్కీ సూచించడం అనుకూల నిర్ణయంగా భావించబడుతోంది.
We await a full and lasting ceasefire, starting from tomorrow, to provide the necessary basis for diplomacy. There is no point in prolonging the killings. And I will be waiting for Putin in Türkiye on Thursday. Personally. I hope that this time the Russians will not look for…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) May 11, 2025
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?