EAM Jaishankar: రాత్రి ఉగ్రవాదం, పగలు వ్యాపారం.. పాక్పై విదేశాంగ మంత్రి మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EAM Jaishankar: ఒక సభ్యుడు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నంత కాలం భారతదేశం సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) సమావేశాన్ని నిర్వహించలేమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం తెలిపారు. రాత్రిపూట ఉగ్రవాదం, పగటిపూట వ్యాపారం జరిగే పరిస్థితిని భారతదేశం సహించదని పాకిస్థాన్పై జైశంకర్ మండిపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా, సార్క్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంకతో సహా దక్షిణాసియాలోని ఎనిమిది దేశాల ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ సంస్థ.
ఇతర పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, కానీ పాకిస్తాన్తో కాదని జైశంకర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం కారణంగా పాక్తో సాధారణ సంబంధాలు కలిగి ఉండలేకపోతున్నామని అన్నారు. ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్తో సాధారణ సంబంధాన్ని కలిగి ఉండటం సాధ్యం కాదన్నారు. ప్రధాని అమెరికా పర్యటనపై, యూఎస్తో సంబంధాలపై ఆయన స్పందించారు. ప్రధాని పర్యటన అత్యంత ఉత్పాదకంగా జైశంకర్ అభివర్ణించారు. పర్యటన నుంచి వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. రెండు దేశాల మధ్య సంబంధాలు అనూహ్యందా బాగా పెరిగాయన్నారు.
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
Also Read: Jammu And Kashmir: జమ్మూలో బక్రీద్ జోష్.. రంగుల కాంతులతో ముస్తాబైన కాశ్మీర్
కెనడా ఖలిస్థాన్ సమస్యపై ఆయన మాట్లాడారు. కెనడా ఖలిస్తానీ సమస్యతో ఎలా వ్యవహరిస్తుందనేది చాలా కాలంగా ఆందోళనగా ఉందన్నారు. ఎందుకంటే చాలా స్పష్టంగా, వారు ఓటు బ్యాంకు రాజకీయాలచే నడపబడుతున్నట్లు కనిపిస్తున్నారని జైశంకర్ అన్నారు. ఖలిస్థానీ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య సంబంధాలను అనేక విధాలుగా ప్రభావితం చేసిందని ఆయన అన్నారు. ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులు, తీవ్రవాద అంశాలకు చోటు కల్పించకుండా కెనడాను భారత్ అడుగుతోంది. కెనడా కార్యకలాపాలు భారత జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తే స్పందిస్తామని విదేశాంగ మంత్రి కెనడాకు స్పష్టం చేశారు.
చైనాతో ప్రతిష్టంభన
ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. లడఖ్ ప్రతిష్టంభన తరువాత భారతదేశం, చైనా మధ్య సంబంధాల గురించి కూడా మాట్లాడారు. “సరిహద్దు పరిస్థితి నేటికీ అసాధారణంగా ఉంది” అని జైశంకర్ అన్నారు. సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలను ఉల్లంఘించినందున భారతదేశం, చైనా మధ్య సంబంధాలు కష్టతరమైన దశ గుండా వెళుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. విస్తృతమైన దౌత్య, సైనిక చర్చల తరువాత ఇరుపక్షాలు అనేక ప్రాంతాల నుండి విడదీయడం పూర్తి చేసినప్పటికీ, తూర్పు లడఖ్లోని కొన్ని ఘర్షణ పాయింట్లలో భారతదేశం, చైనా దళాలు ఘర్షణలో చిక్కుకున్నాయి.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!