Padma Devendar Reddy : భారీ వర్షాలతో అతలాకుతలం.. అమ్మవారికి బోనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఏడుపాయల శ్రీవనదుర్గ భవాని ఆలయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంజీర పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంజీర ఉధృతంగా ప్రవహిస్తున్నందున, తెలంగాణలోని నది ఒడ్డున నివసించే ప్రజలు క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రార్థించారు. ఏడుపాయల దేవాలయం గుండా ప్రవహించే మంజీర నది వద్ద గంగామాతకు పద్మా దేవేందర్ రెడ్డి హారతి ఇచ్చారు. ఆలయం దగ్గరగా ఉన్నందున రాజ గోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి ఆమె పూజలు చేశారు. పద్మదేవేందర్రెడ్డి తో పాటు మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి ప్రవాహం తగ్గే వరకు రైతులు నది దగ్గరకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నదీ తీరం వెంబడి ఉన్న కొన్ని వ్యవసాయ పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. అయితే ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులను అప్రమత్తం చేశారని ఆమె అన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఆలయ చైర్మన్ బాల గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సింగూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ సంఖ్యలో ఇన్ ఫ్లోలు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎగువ నుంచి 29,901 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇరిగేషన్ అధికారులు మూడు గేట్లను ఎత్తివేశారు. ఔట్ఫ్లోలను 35 వేల క్యూసెక్కులుగా ఉంచారు. పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలకుగానూ 29.293టీఎంసీల నీరు ఉంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..