Paddy Procurement : నిజామాబాద్లో ధాన్యం దిబ్బలు.. రైతుల కన్నీళ్లు.. లారీల మాయాజాలంలో అన్నదాత అగచాట్లు..!
- లారీలు లేక ధరించని ధాన్యం.. రైతుల గుండెల్లో ఆందోళన
- కృత్రిమ కొరత కుట్ర.. నల్లమట్టి, ఇసుక వ్యాపారాలకే లారీలు
- పంట మట్టిపాలుకాక ముందు అధికారులు స్పందిస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paddy Procurement : నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు పండించిన బంగారం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ధాన్యం రాశులు కళ్లెదుటే క్షీణిస్తుంటే రైతుల గుండెలు మాత్రం ఆందోళనతో కొట్టుకుంటున్నాయి. దీనికి కారణం లారీల కొరత.. ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కుప్పలతో నిండిపోయాయి. రోజుల తరబడి రైతులు తమ ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దీని వెనుక అసలు కథ వేరే ఉంది.. లారీ కాంట్రాక్టర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం తరలింపునకు వినియోగించాల్సిన లారీలను నల్ల మట్టి, ఇసుక వంటి ఇతర వ్యాపారాలకు మళ్లిస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు.
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
ఒక్కో గింజను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎన్నో కష్టనష్టాలకోర్చి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతం. సమయానికి ధాన్యం తరలింపు జరగకపోవడంతో నాణ్యత తగ్గిపోతోంది. మరోవైపు అప్పులు తెచ్చి వ్యవసాయం చేసిన రైతులు వాటిని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది బాగానే ఉంది. కానీ, ధాన్యం తరలింపునకు సరైన వ్యవస్థ లేకపోతే ఈ కేంద్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి..? లారీ కాంట్రాక్టర్ల స్వార్థపూరిత చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే, రైతుల కష్టాలు ఇలాగే కొనసాగుతాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే లారీలను అందుబాటులోకి తెచ్చి ధాన్యం తరలింపునకు చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే, పండించిన పంట కళ్లెదుటే మట్టిపాలై, వారి జీవితాలు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది. నిజామాబాద్ రైతుల ఆర్తనాదాలు ఉన్నతాధికారులకు వినిపిస్తాయా..? వేచి చూడాలి..!
Pahalgam Terror Attack: దాడిని ఖండిస్తూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!