Paddy Cultivation : వరిలో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే ఆహారపు పంటలల్లో వరి కూడా ఒకటి.. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో కోత దశలో ఉంది.. చలికాలం మంచు కారణంగా వరిపైరులో చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..
నీటి వసతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వరిని పండిస్తున్నారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుండి కంకిపాలుపోసుకునే దశ వరకు ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో పిలక దశనుండి పొట్టదశ వరకు ఉంది. మిశ్రమ వాతావరణ మార్పుల వలన వరిపైరులో కాండంతొలుచు పురుగు, ఆకుముడత పురుగు, సుడిదోమ, నల్లిజాతి పురుగుల ఉధృతి పెరిగింది.. తెగుళ్లు వాటి నివారణ చర్యలను ఇప్పుడు చూద్దాం..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
ఉల్లికోడు..
పిల్ల పురుగులు కాండాన్ని తొలిచి ఆంకురం వద్ద వృద్ధి చెందుతుంది. తర్వాత అంకురం లేత ఆకుపచ్చని పొడగాటి గొట్టంగా మార్పుచెంది బయటకు వస్తుంది. ఆలస్యంగా నాటిన పొలాల్లో ఈ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ..
ఉల్లి గొట్టాలు కనిపిస్త్తే కార్భొఫ్యూరాన్ 3జీ గుళికలు ఎకరాకు 10 కిలోలు లేదా, ఫోరెట్ 10జీ గుళికలు ఎకరాకు 5కిలోలు వెదజల్లాలి..
బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు..
వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉధృతి పెరుగుతుంది. తెగులు సోకిన ఆకులపై పసుపురంగు మచ్చలు ఏర్పడి దుబ్బుకు ఇరుపక్కలా ఆకులు ఎండి పోతాయి
నివారణ..
అగ్రిమైసిన్ లేదా ప్లాంటామైసిన్ 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో లేదా 30గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 10లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి..
కాండం తొలిచే పురుగు..
పిలకలు తొడిగే దశలో ఈ పురుగు ఆశించిన మొవ్వులు ఎండి చనిపోతాయి. పూత దశ తర్వాత ఆశిస్తే వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. చచ్చిన మొవ్వులు/కంకులు పీకితే తేలికగా బయటకు వస్తాయి.
నివారణ..
ఆలస్యంగా వరి నాట్లు పడితే పైరుకు 30 రోజుల్లోపు ఎకరాకు కార్బొఫ్యూరాన్ 3జీ గుళికలు 10కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8కిలోల మిశ్రమాన్ని పొలంలో నీరు తగ్గించి చల్లాలి. లేదా క్లోరాంటోనిలీఫ్రోల్ 4కిలోలు చల్లాలి. ఇక రెక్కల పురుగు ఉధృతి గమనిస్తే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ను 50శాతం, ఎస్పీ 400 గ్రాములు లేదా క్లోరాంటోనీలిప్రోల్ 60 మిల్లీ లీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు బాగా తడిచేలా పిచికారీ చేయాలి.. ఇవే కాదు ఇంకా చాలా రకాల తెగుళ్లు ఉన్నాయి.. పంటను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నివారణ చేపట్టాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!