Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో ఎన్నికలు.. విధుల్లో ఉన్న 200 మందికి పైగా అధికారులు మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ మంగళవారం ముగిసింది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని బీజాపూర్లో అత్యల్ప పోలింగ్ అంటే కేవలం 40.98 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్ ముగిసి కూడా దాదాపు 24 గంటలకు పైగా అవుతుంది. కాగా పోలింగ్ బృందం లోని 200 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఇప్పటి వరకు ఎన్నికల కంట్రోల్ రూమ్కు నివేదికను సమర్పించ లేదని ఎన్నికల కంట్రోల్ రూమ్ కి సంబంధించిన అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు మిస్ అయిన సిబ్బంది గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్ లో 71.48 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. అయితే పోలింగ్ సమయంలో నక్సలైట్లు హింసకు పాల్పడుతూ, ఓటింగ్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ముప్పును పసిగట్టిన అధికారులు వేర్వేరు సమయాల్లో ఓటు వేసేందుకు అనుమతించారు. దీనితో కేవలం 40.98 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.
Read also:Kotha Prabhakar Reddy: అంబులెన్స్లో వచ్చి నేడు నామినేషన్ వేయనున్న కొత్త ప్రభాకర్ రెడ్డి
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్లో పోలింగ్ బూత్ల దగ్గర దింపారు. అయితే విధులు నిర్వహిస్తున్న 200 మందికి పైగా సిబ్బంది ప్రస్తుతం కనిపించడం లేదు. వారు ఏం అయ్యారు అనే విషయం పైన ఇప్పటికీ స్పస్టత లేదు. ఈ నేపధ్యం లో బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆంజనేయ వైష్ణవ్ మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ సిబ్బందిని నక్సల్స్ కిడ్నప్ చేసి ఉంటారని మేము అనుమానిస్తున్నామని.. మిస్ అయిన సిబంది కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలానే దాదాపు 76 చోట్ల హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని పంపామని.. కాగా పోలింగ్ ముగిసిన తరువాత సిబ్బంది కనిపించలేదని తెలిపిన ఆయన మిస్ అయిన సిబ్బంది భద్రత బాధ్యత తమదేనని పేర్కున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?