NDA Meet: ప్రధాని మోడీ సమక్షంలో 38 పార్టీలతో ఎన్డీయే కూటమి భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NDA Meet: దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే బల నిరూపణగా భావించే ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోకకు చేరుకున్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రధాని మోడీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘనస్వాగతం పలికారు. భారత్ అంతటా విస్తరించి ఉన్న తమ కూటమి భాగస్వాములతో నేడు సమావేశం జరగనుండటం సంతోషంగా ఉందని భేటీకి ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరడానికి, దేశ అభివృద్ధికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు కూటమిలో ఉన్న పార్టీల నేతలు ప్రధాని మోడీకి పూల మాలతో సత్కరించారు.
Also Read: Madhyapradesh: భార్యకు బలవంతంగా మూత్రం తాగించిన వ్యక్తి అరెస్ట్
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏను గట్టెక్కించడానికి, అభివృద్ధి చెందుతున్న మహా ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి బీజేపీ కొనసాగుతున్న ప్రయత్నాలలో ఈ సమావేశం ఓ భాగమని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి హాజరైన పార్టీలు చాలావరకు చిన్న పార్టీలు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు కాగా.. మరికొన్నింటికి అసలు ఎంపీలే లేరు. ఏదైమైన ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో తేల్చుకునే అవకాశంగా ఈ భేటీని చిన్న పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. యూపీ, బీహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు అన్ని చర్యలు చేపడుతోంది.
Also Read: Chhattisgarh: ఛత్తీస్గఢ్లో పురుషుల నగ్న నిరసన.. ఎందుకంటే?
ఎన్డీయే భేటీలో పాల్గొన్న పార్టీలు ఇవే..
బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే గ్రూప్), ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అజిత్ పవార్), ఏఐఏడీఎంకే, అప్నా దళ్, ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ, మేఘాలయ), ఎన్డీపీ (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ), లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), ఏజేఎస్యూ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్), ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా), ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్), ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర), ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ, మేఘాలయ), ఆర్పీఐ(రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), ఏజీపీ (అసోం గణ పరిషత్), పీఎంకే (పట్టాలి మక్కల్ కట్చి), టీఎంసీ (తమిళ మనీలా కాంగ్రెస్), (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, అస్సాం), ఎస్బీఎస్ఏపీ (సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ఓం ప్రకాష్ రాజ్భర్) సమావేశానికి హాజరయ్యాయి.
ఆ పార్టీలతో పాటు శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్, ధాడియాల్), ఎంజీపీ (మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ), జేజేపీ (జననాయక్ జనతా పార్టీ), రాష్ట్రీయ లోక్ జన శక్తి పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, జన్ సురాజ్య శక్తి పార్టీ, కుకీ పీపుల్ కూటమి, యునైటెడ్ డెమోక్రటిక్ మేఘాలయ, నిషా, హెచ్ఎస్పీడీపీ, నిషా , అఖిల భారతీయ ఎన్ఆర్ కాంగ్రెస్, హెచ్ఏఎం (జీతన్ రామ్ మాంఝీ), జనసేన పార్టీ, హర్యానా లోక్ హిట్ పార్టీ, భరత్ ధర్మజన్ సేన, కేరళ కామ్రాజ్ కాంగ్రెస్, పుతియా తమిళగం, గోరఖా ఎన్ఎల్ఎఫ్ పార్టీలు కూడా సమావేశానికి హాజరయ్యాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..