Sheikh Hasina: మా తల్లి మళ్లీ రాజకీయాల్లోకి రాదు.. షేక్ హసీనా కొడుకు కీలక వ్యాఖ్యలు
- షేక్ హసీనా మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లడం కష్టమే
- షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ కీలక వ్యాఖ్యలు
- తన కుటుంబం అభ్యర్థన మేరకు.. తన భద్రత కోసం దేశం విడిచిపెట్టి వెళ్లింది- కుమారుడు
- తన తల్లికి రాజకీయ పునరాగమనం ఉండదు- సాజిబ్ వాజెద్ జాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వెంటనే బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారు. అయితే.. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లడం కష్టమనే తెలుస్తుంది. ఈ క్రమంలో.. షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా తన కుటుంబం అభ్యర్థన మేరకు.. తన భద్రత కోసం దేశం విడిచిపెట్టి వెళ్లారని ఆయన చెప్పారు. 76 ఏళ్ల హసీనా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనల మధ్య రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయారని అన్నారు.
Read Also: Kishan Reddy: వచ్చే నెలలో జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు..
Also Read
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన తల్లికి రాజకీయ పునరాగమనం ఉండదని జాయ్ చెప్పారు. ఆదివారం నుంచి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు, తన భద్రత కోసం దేశం విడిచి వెళ్లిపోయిందన్నారు. నివేదిక ప్రకారం.. తన తల్లి బంగ్లాదేశ్ను 15 సంవత్సరాలు పాలించిందని జాయ్ చెప్పారు. ఇప్పుడు తాను ఎంత కష్టపడి పనిచేసినా మైనారిటీలు తనపై ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు.
Read Also: Mamata banerjee: బంగ్లాదేశ్ విషయంలో మోడీ సర్కార్ నిర్ణయాలకు మద్దతుగా ఉంటాం
బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో హసీనా రాజీనామాను డిమాండ్ చేస్తున్న నిరసనకారులు.. అధికార అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య ఆదివారం ఘర్షణలు తలెత్తాయి. కొన్ని రోజుల క్రితం.. పోలీసులు, ఎక్కువగా విద్యార్థుల నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలలో 200 మందికి పైగా మరణించారు. వారం రోజుల్లో కనీసం 300 మంది చనిపోయారు. 1971 యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాల పిల్లలకు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హసీనా సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు.
తాజావార్తలు
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!