Joshimath : శరవేగంగా కుంగుతున్న జోషిమఠ్.. షాక్ పుట్టిస్తున్న ఛాయా చిత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joshimath : ప్రముఖ పర్యాటక కేంద్రం జోషిమఠ్ శరవేగంగా కుంగిపోతుంది. తాజాగా డిసెంబర్ 27 – జనవరి 8 మధ్య పట్టణం 5.4 సెం.మీ. మేరకు కుంగినట్లు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉపగ్రహ చాయా చిత్రాలను విడుదల చేసింది. గతేడాది జోషిమఠ్ ఏప్రిల్-నవంబర్ మధ్య 9సెం.మీ మేర కుంగింది. ఆర్మీ హెలిప్యాడ్, దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతంలోని సెంట్రల్ జోషిమఠ్లో మట్టిని వేగంగా తరలించడం జరిగింది. 2,180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్-ఔలీ రహదారికి సమీపంలో ఈ క్షీణత ఉందని ఇస్రో నివేదిక పేర్కొంది. అంతకుముందు నెలల్లో కుంగిన రేటు చాలా తక్కువగా ఉందని ఏజెన్సీ నివేదించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నివేదిక ప్రకారం ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ కేవలం 12 రోజుల్లో 5.4 సెం.మీ. కుంగినట్లు ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
Read Also: Dadisetti Raja: పవన్ కళ్యాణ్ హవాలా చేస్తూ దొరికిపోయాడు
Also Read
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
జోషిమఠ్ మాత్రమే కాకుండా ఆ రాష్ట్రంలోని బద్రీనాథ్కు ముఖద్వారంగా భావిస్తున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉందని డెహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ గుర్తించింది. ఆయా పట్టణంలోని భవనాలు, రోడ్లలో భారీ పగుళ్లు ఏర్పడటంతో విపత్తు అంచున ఉంది. శాటిలైట్ సర్వే తర్వాత దాదాపు 4,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు. హోటళ్లు, వ్యాపార సంస్థలతో పాటు 678 గృహాలు ప్రమాదంలో ఉన్నాయని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
Read Also: NTR: మాస్ హీరో క్లాస్ అవతారం ఎత్తి ఏడేళ్లు…
ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన ప్రాజెక్టులే సంక్షోభానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. గురువారం జోషిమఠ్ను సందర్శించి స్థానికులు, నిపుణులతో సమావేశాలు నిర్వహించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, బాధిత కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం రేటును వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు.
Read Also: Mahesh Babu: ఇలాంటి క్యారెక్టర్ ఇంకొకటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా
ప్రస్తుతానికి, ప్రతి బాధిత కుటుంబానికి తాత్కాలిక పరిహారం కింద రూ.లక్షన్నర ప్రకటించారు. ఇంకా నష్టపరిహార రేట్లపై కసరత్తు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తరఫున ఆయన ప్రకటించారు. హోం మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ఆర్కే సింగ్, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, సీనియర్ ప్రభుత్వ అధికారులతో పరిస్థితిని సమీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
తాజావార్తలు
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!