No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఆమోదించిన లోక్సభ స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Confidence Motion: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్ ఇప్పుడు చర్చ తేదీని త్వరలో ప్రకటిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక నోటీసును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఫ్లోర్ లీడర్ నాగేశ్వర్ రావు స్పీకర్కు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Enforcement Directorate: ఈడీ చీఫ్ పదవిని పొడిగించాలి.. సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
అవిశ్వాస తీర్మానం సభా వేదికపై ప్రభుత్వ మెజారిటీని సవాలు చేయడానికి ప్రతిపక్షాన్ని అనుమతిస్తుంది. తీర్మానం ఆమోదించబడితే, ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. మణిపూర్లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం మండిపడ్డారు. మణిపూర్! మణిపూర్ నినాదాల మధ్య అమిత్ షా మాట్లాడుతూ.. “ఇప్పుడు ఎవరు నినాదాలు చేస్తున్నా, వారికి ప్రభుత్వంపై లేదా సహకారంపై ఆసక్తి లేదు. వారికి దళితులపై లేదా మహిళల సంక్షేమంపై ఆసక్తి లేదు.. నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. ఏ రకమైన సుదీర్ఘ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను.” అని అమిత్ షా పేర్కొన్నారు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ఒకరోజు ముందు అంటే జూలై 19న మే 4న వీడియో వైరల్గా మారింది.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!