No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. ఆమోదించిన లోక్సభ స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Confidence Motion: మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బుధవారం నోటీసులు సమర్పించాయి. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. స్పీకర్ ఇప్పుడు చర్చ తేదీని త్వరలో ప్రకటిస్తారు. లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ లోక్సభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి నోటీసు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక నోటీసును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఫ్లోర్ లీడర్ నాగేశ్వర్ రావు స్పీకర్కు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Enforcement Directorate: ఈడీ చీఫ్ పదవిని పొడిగించాలి.. సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
అవిశ్వాస తీర్మానం సభా వేదికపై ప్రభుత్వ మెజారిటీని సవాలు చేయడానికి ప్రతిపక్షాన్ని అనుమతిస్తుంది. తీర్మానం ఆమోదించబడితే, ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. మణిపూర్లో జరిగిన హింసాకాండను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మణిపూర్లో జరిగిన హింసాకాండపై ప్రధాని మోడీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమయ్యాయి. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోడీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష నేతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం మండిపడ్డారు. మణిపూర్! మణిపూర్ నినాదాల మధ్య అమిత్ షా మాట్లాడుతూ.. “ఇప్పుడు ఎవరు నినాదాలు చేస్తున్నా, వారికి ప్రభుత్వంపై లేదా సహకారంపై ఆసక్తి లేదు. వారికి దళితులపై లేదా మహిళల సంక్షేమంపై ఆసక్తి లేదు.. నేను పునరుద్ఘాటించాలనుకుంటున్నాను. ఏ రకమైన సుదీర్ఘ చర్చకైనా నేను సిద్ధంగా ఉన్నాను.” అని అమిత్ షా పేర్కొన్నారు.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 20న ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ఒకరోజు ముందు అంటే జూలై 19న మే 4న వీడియో వైరల్గా మారింది.
తాజావార్తలు
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!