Operation Abhyas: ముగిసిన ‘ఆపరేషన్ అభ్యాస్’ మాక్ డ్రిల్.. అరగంట పాటు కొనసాగిన డ్రిల్
- ముగిసిన 'ఆపరేషన్ అభ్యాస్' మాక్ డ్రిల్..
- అరగంట పాటు కొనసాగిన డ్రిల్
- నానల్నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Abhyas: అత్యవసర పరిస్థితుల్లో ప్రజల చొరవ, సహాయక సంస్థల సమన్వయం ఎంతో అవసరం. దీనికోసం ప్రభుత్వం తరచూ నిర్వహించే విధానాలే మాక్ డ్రిల్స్. అంటే,అనుకోని ప్రమాదాలు, ఉగ్రదాడులు, సహజ విపత్తులు వంటి సందర్భాల్లో ఎలా స్పందించాలి, ఎవరెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల్లో ముందస్తుగా ప్రాక్టీస్ చేసే కార్యక్రమాలు. ఇందులో ప్రభుత్వ విభాగాలు, సహాయక బృందాలు, ప్రజలు కలిసి పాల్గొంటారు. ఇక ప్రస్తుతం పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో “ఆపరేషన్ అభ్యాస్” పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ డ్రిల్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది.
Read Also: Reels Malking: రీల్స్ తీసి పెట్టండి… డబ్బులు సంపాదించండి!
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
మాక్ డ్రిల్ ప్రారంభంలో నగరంలోని ముఖ్య కూడళ్లలో, అపార్ట్మెంట్ల వద్ద సైరన్లు మోగించారు. ప్రజల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టారు అధికారులు. ప్రజలతో పాటు సహాయక సిబ్బంది కూడా ఈ డ్రిల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నానల్నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), రక్షణశాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు డ్రిల్ను పర్యవేక్షించారు.
Read Also: Rajnath Singh: “వారే మా టార్గెట్” రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఇక సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగితే ఎలాఉంటుందో.. ఊహించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 12 మంది సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ అధికారులు పాల్గొని సూచనలు ఇచ్చారు. దాదాపు అరగంట పాటు కొనసాగిన ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజలు, అధికార సిబ్బంది అత్యవసర సమయంలో ఎలా స్పందించాలో, ఎవరి బాధ్యతలు ఏమిటన్న అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగింది.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!