Jammu Kashmir: ఉరిలో పాకిస్తాన్ కాల్పులు.. మహిళ మృతి, మరొకరికి గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని ఉరి ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దు షెల్లింగ్లో గురువారం ఒక మహిళ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇక అధికారుల ప్రకారం, రేజర్వానీ నుంచి బారాముల్లా వెళ్ళిన ఒక వాహనం మొహురా సమీపంలో శెల్లింగ్ దాడికి గురైంది. ఈ దాడిలో బశీర్ ఖాన్ భార్య నాగ్రిస్ బేగం అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అలాగే రాజీక్ అహ్మద్ ఖాన్ భార్య మహిళ హఫీజా గాయాలపాలు కావడంతో వెంటనే జీఎంసీ బారాముల్లాకు తరలించినట్లు పేర్కొన్నారు.
Read Also: X Blocks Accounts: భారత్లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన X.. ప్రభుత్వ ఆదేశాలపై స్పందన.!
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
గత కొన్ని రోజులుగా ఉత్తర కాశ్మీర్లోని ఉరి మరియు కుప్వారా ప్రాంతాలలోని సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ నిరంతరం షెల్లింగ్ చేస్తోంది. గురువారం రాత్రి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఇంకా రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో పాటు డ్రోన్లతో కాల్పులు జరిపింది. అంతే కాకుండా తీవ్ర ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం జమ్మూ, పంజాబ్లోని పఠాన్కోట్ అలాగే రాజస్థాన్లోని జైసల్మేర్లలో కాల్పులు జరిపింది.
Read Also: Samba : సాంబా సెక్టార్లో ఉగ్ర కుట్ర.. 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం
అయితే, అన్ని డ్రోన్లతో పాటు క్షిపణులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు నాశనం చేసాయి. అలాగే జైసల్మేర్లో పాకిస్తాన్ డ్రోన్ లను భారత వైమానిక రక్షణ కూడా అడ్డుకుంది.ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న ఒక రోజు తర్వాత ఇది జరిగింది. 15 భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారతదేశం భగ్నం చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!