Challa Family Dispute: చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు.. ఘర్షణ, పరస్పరం దాడులు
Challa Family Dispute: నంద్యాల జిల్లా అవుకులో దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.. చల్లా కుటుంబంలో ఎప్పటి నుంచో ఈ విభేదాలు కొనసాగుతూ రాగా.. ఈ సారి, ఘర్షణ, పరస్పరం దాడి వరకు వెళ్లింది వ్యవహారం.. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇంటి దగ్గర కారు పార్కింగ్ విషయంలో, పిల్లల విషయంలో ఈ సారి ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట చల్లా కుటుంబ సభ్యులు.. ఈ ఘర్షణతో గాయాలు కూడా అయ్యాయి.. దీంతో.. బనగానపల్లి ఆసుపత్రిలో చల్లా శ్రీలక్ష్మి, అవుకు ఆసుపత్రిలో చల్లా శ్రీదేవి చేరారు.. ఏడాదిగా ఆస్తుల వివాదంలో తరచూ వీధికెక్కుతూ వస్తున్నారు చల్లా కుటుంబ సభ్యులు..
Read Also: CM YS Jagan Kadapa Tour: రెండో రోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
Also Read
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
కాగా, దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో ఆయన మృతి తర్వాత విభేదాలు నెలకొన్నాయి. అవి కాస్తా చల్లా కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫొటో ఫ్రేమ్ కోసం మొదలైన గొడవ పెద్ద గాలివానలా మారిందని.. ఆ తర్వాత ఆస్తి, రాజకీయ వారసత్వం ఇలా కొత్త విషయాలు తెరపైకి వచ్చాయనే చర్చలు జరిగాయి. అత్తా కోడల మధ్య గొడవలోకి ఆడపడుచు ఎంట్రీ అవ్వడంతో కథ మరో మలుపు తిరిగిందని చెబుతారు. అయితే, చల్లా రామకృష్ణారెడ్డి రాయలసీమ సీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.. కానీ, చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరిలో అనారోగ్యంతో కన్నుమూశారు.. ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే ఆయన మృతిచెందడంతో ఆయన తర్వాత ఎమ్మెల్సీ పదవిని చల్లా రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కూడా 2022 నవంబర్లో మరణించారు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి.. చల్లా కుటుంబం రెండుగా చీలిపోయింది.. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో తరచూ ఏదో వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు పరస్పరం దాడి వరకు వెళ్లింది.
తాజావార్తలు
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!