Off The Record : టీడీపీ మహానాడును ఈసారి Kadapa లోనే ఎందుకు నిర్వహిస్తున్నారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం మహానాడును ఈసారి కడప జిల్లాలోనే ఎందుకు నిర్వహించబోతున్నారు? గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కడప వైపు ఎందుకు చూసింది టీడీపీ పొలిట్బ్యూరో? జగన్ అడ్డాలో సత్తా చూపాలనుకోవడమేనా? లేక అంతకు మించిన వేరే కారణాలు ఉన్నాయా? అసలు టీడీపీ టార్గెట్ ఏంటి? మహానాడు వ్యూహం ఏంటి? కడప జిల్లా రాజకీయాల ప్రస్తావనలో ఎవరికైనా… ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. నాటి కాంగ్రెస్ పార్టీ నుంచి నేటి వైసీపీ వరకు… ఇక్కడంతా ఆ కుటుంబానిదే హవా. అందుకు తగ్గట్టే… గడిచిన పాతికేళ్ళలో ఉమ్మడి కడప జిల్లాలో టిడిపికి నామ మాత్రపు సీట్లే దక్కాయి. మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను… 2004లో ఒక్క చోట మాత్రమే గెలిచింది తెలుగుదేశం. 2009లో కూడా అదే పరిస్థితి. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. ఇక 2019కి వచ్చేసరికి మొత్తం పదికి పది సీట్లు దక్కించుకుని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ… ఈసారి మాత్రం సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా పుంజుకుంది టీడీపీ. ఉమ్మడి కడప జిల్లాలోని పది స్థానాలకు గాను ఏడు చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. ఇందులో… టిడిపి ఐదు, బిజెపి ఒకటి, జనసేన ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. మొట్టమొదటిసారిగా జిల్లాలో బిజెపి, జనసేన బోణీ కొట్టాయి. రాష్ట్రంలో అధికారం రావడం ఒక ఎత్తయితే… కడపలో కుమ్మేయడం మరో ఎత్తు అనుకుంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. జగన్ అడ్డాలో ఏకంగా ఏడు ఎమ్మెల్యే సీట్లు కొట్టి సత్తా చాటామని, ఇక ఈ పట్టు తగ్గకుండా చూసుకోవాలని డిసైడైనట్టు తెలిసింది.
అలా పట్టు నిలుపుకునే క్రమంలోనే ఈసారి టీడీపీ మహానాడును కడపలో పెట్టాలని డిసైడయ్యారట. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా కడపలో మహానాడు నిర్వహించలేదు. దాంతో ఇప్పుడు మొదటిసారిగా కడప జిల్లాలో పెట్టడమే కాకుండా…వైసీపీ అడ్డాలో తమ బలాన్ని నిరూపించుకోవాలని అనుకుంటున్నారట టీడీపీ పెద్దలు. కడపలో మహానాడు నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించడం వెనక రీజన్ ఇదేనని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. కడప లాంటి ఉమ్మడి జిల్లాలో కూటమి ఏడు సీట్లు గెలవడంతో…స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అదే స్థాయి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్రెడ్డికి మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ పదవులు వరించాయి. కేవలం నాయకులతో సరిపెట్టకుండా… రాయలసీమలోని పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా కల్పించాలన్న ప్లాన్లో ఉందట టిడిపి అదిష్టానం. అందుకే కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. నిర్వహణ కోసం కడప నగరంలోని నాలుగు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా నేతలు అధిష్టానానికి నివేదికలు పంపారట. ఇప్పటికే వైసిపి అడ్డాలో పాగా వేసిన టిడిపి… మహానాడు నిర్వహణతో తన సత్తా చాటాలని అనుకుంటోందట. అటు వైసిపికి బిగ్ షాక్ ఇవ్వడంతోపాటు కార్యకర్తలకు భరోసా కల్పించాలన్నదే టిడిపి ధ్యేయంగా చెప్పుకుంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా…మహానాడు జరగాలన్నది టీడీపీ పెద్దల టార్గెట్గా తెలుస్తోంది. ఎంతవరకు ఆ లక్ష్యం నెరవేరుతుందో చూడాలంటున్నారు విశ్లేషకులు.
Also Read
- Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
- Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
- Fielder Clicks Finger Video: క్రికెట్ చరిత్రలోనే వినూత్న చీటింగ్.. వేలితో చిటికేసి బ్యాటర్ను అవుట్ చేశాడు.. వీడియో వైరల్..
- YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
- Tags
- ntv
- OTR
- tdp mahanadu
తాజావార్తలు
-
Pavala Shyamala: శ్యామల ఎలా ‘పావలా శ్యామల’ అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
-
KTR : హైడ్రా సంస్కరణ కాదు.. అరాచక సంస్థ.. కేటీఆర్ ఫైర్
-
Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
-
Trump-Netanyahu: ట్రంప్-నెతన్యాహు విభేదాలు.. దేనికోసమంటే..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!