Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record On Voters

Off The Record : రెండు ఓట్లు ఉన్నవారు ఈసారి ఎక్కడ ఓటు వేస్తారు.? కొత్తగా వచ్చిన సమస్యేంటి.?

Published Date :March 19, 2024 , 10:48 pm
By Gogikar Sai Krishna
Off The Record : రెండు ఓట్లు ఉన్నవారు ఈసారి ఎక్కడ ఓటు వేస్తారు.? కొత్తగా వచ్చిన సమస్యేంటి.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

రెండు ఓట్లు ఉన్నవాళ్ళు ఈసారి ఎక్కడ ఓటేస్తారు? వారి ప్రయారిటీ ఎటువైపు ఉండవచ్చు? రాజకీయ వర్గాల్లో కొత్తగా మొదలైన చర్చ ఇది. అదేంటీ… ఎవరికైనా ఉండాల్సింది ఒక ఓటే కదా? అదే కదా రూల్‌? రెండు ఓట్లు ఇల్లీగల్‌ కదా… అని ఆలోచిస్తున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్‌. ఈసారి ఎన్నికల్లో ఈ డబుల్‌ బాబులకు వెరైటీ కష్టం వచ్చేసిందట. ఇంతకీ ఏంటా డబుల్‌ ఓట్స్‌ స్టోరీ? వాళ్ళకు వచ్చిన కొత్త కష్టం ఏంటి? ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌… తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఓట్లున్నవారు ఏం చేస్తారన్న ఆసక్తిరక చర్చ మొదలైంది. వేర్వేకు ఫేజ్‌లలో పోలింగ్‌ జరిగితే రెండు చోట్లా ఓటేసే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. కానీ… ఈసారి రెండు రాష్ట్రాలకు కలిసి నాలుగో విడతలోనే పోలింగ్‌ జరగబోతుండటంతో కొత్త చర్చకు తెర లేచింది. వాస్తవానికి ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఓటు హక్కు ఉండాలి. కానీ… ప్రస్తుతం హైదరాబాద్‌, పరిసరాలల్లో స్థిరపడ్డ సీమాంధ్రుల్లో చాలా మందికి అటు సొంత ఊళ్ళోను, ఇటు హైదరాబాద్‌లోనూ ఓట్లున్నాయి. ఆధార్‌ లింక్‌ లేకుండా ఇలా రెండు రాష్ట్రాల్లో ఓట్లున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉందట. దీంతో ఇప్పుడు వాళ్లంతా సొంతూరికి వెళ్ళి అక్కడ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులకు ఓట్లేస్తారా? లేక హైదరాబాద్‌లో ఉండి ఇక్కడి ఓటు హక్కు వినియోగించుకుంటారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. డబుల్‌ ఓట్లు, దొంగ ఓట్లను ఏరి పారేస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్న ఎన్నికల సంఘం…దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా…చర్యలు మాత్రం శూన్యం.

గతంలో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండు ప్రాంతాల్లో వేర్వేరు తేదీల్లో పోలింగ్‌ జరిగితే.. రెండు చోట్ల ఓటేసిన వారు చాలా మందే ఉన్నారు. అయితే… ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా ఉన్నా… రెండు చోట్లా ఒకే రోజు అంటే… మే 13నే పోలింగ్‌ జరగనుంది. అందుకే అలా డబుల్‌ ఓట్లున్నవాళ్ళు ఎటు వైపు మొగ్గుతారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఓటుకు సై అంటారా? లేక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడి ఓటుకే ప్రాధాన్యం ఇస్తారా అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధితో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నియోజక వర్గాల్లో లక్షల మందికి రెండు రాష్ట్రాల్లో ఓటు ఉంది. ఇవి ఫలితాలను ప్రభావితం చేయగల స్థాయిలో కూడా ఉంటాయి. అందుకే వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏ రాష్ట్రంలో ఎవరి కొంప ముంచుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోందట రాజకీయ నేతల్లో. రెండు చోట్ల కేవలం లోక్‌సభ ఎన్నికలే అయితే… పరిస్థితి వేరుగా ఉండేదని, కానీ… ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఎక్కువ మంది అటువైపే మొగ్గుతారన్న అభిప్రాయం బలపడుతోంది. సాధారణంగా ఎంపీకంటే… ఎమ్మెల్యే మీదనే కాన్సంట్రేషన్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు ఫస్ట్‌ ప్రయారిటీ ఉంటాయని విశ్లేషిస్తున్నారు ఎక్కువమంది. వైసీపీ, టీడీపీ, జనసేన… ఇలా అన్ని పార్టీల అభిమానులు, సానుభూతిపరులు హైదరాబాద్‌లో ఉన్నారు గనుక అంతా అంతా అసెంబ్లీకి ఓటెత్తవచ్చంటున్నారు. అదే సమయంలో… వీళ్ళంతా ఏపీకి వెళ్తే… జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంపీ అభ్యర్థుల పోల్‌ పర్సంటేజ్‌ తగ్గవచ్చన్న అంచనాలు సైతం ఉన్నాయి. పద్ధతిగా ఓటేద్దామనుకున్నవారికి ఎక్కడైనా ఓకే. కానీ… గతంలోలాగా రెండు చోట్ల ఓటేసి డూ ఫెస్టివల్‌ అందామనుకున్న వారికి మాత్రం ఇది ఇబ్బందికరమేనన్న వాదన సైతం వినిపిస్తోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ntv
  • off the record

తాజావార్తలు

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

  • PM Ujjwala Yojana: ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయా?.. సబ్సిడీ లభిస్తుందా? పూర్తి వివరాలు

  • Gongura Mutton: గోంగూర మటన్ ఈసారి ఇలా చేయండి.. ఒక్క ముక్క మిగిలితే ఒట్టు

  • Umbilical Cord: బొడ్డు తాడు పారేస్తున్నారా? ప్రాణాంతక వ్యాధులను నయం చేసే ‘మెడికల్ మిరాకిల్’ ఇదే!

  • Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions