Off The Record : ఆ సీటు వైసీపీకి ఎందుకంత స్పెషల్.? అక్కడున్న మహిళా నేతనే టార్గెటా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్రలో ఎస్సీ రిజర్వ్ సీటు అది. అక్కడ తాము గెలవడం కంటే టీడీపీ అభ్యర్ధిని అష్టదిగ్భంధనం చేయడమే టార్గెట్గా పనిచేస్తున్నాయట వైసీపీ శ్రేణులు. ఎత్తులు, పై ఎత్తులతో పొత్తుల గోడలను బద్దలు కొడతామని ఛాలెంజ్ చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఆ సీటు వైసీపీకి ఎందుకంత స్పెషల్? అక్కడున్న మహిళా నేత అంటే ఎందుకంత మంట? ఎవరా లీడర్? ఏంటా కథ?
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో మిగతా అన్ని సీట్లు ఒక లెక్క. పాయకరావుపేట ఒక లెక్క అంటోందట వైసీపీ. టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత టార్గెట్గా ఎక్స్ట్రా డోస్ ఇవ్వాలనుకుంటోందట అధికారపార్టీ అధినాయకత్వం. వైనాట్ 175 అంటున్న పార్టీకి ప్రతి సీటు ముఖ్యమే. అయినా సరే…. అనితను స్పెషల్గా పరిగణించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలన్న పట్టుదలగా వ్యూహాలకు పదును పెడుతున్నారట వైసీపీ నాయకులు. పొలిటికల్ ఎంట్రీ తర్వాత కేవలం ఒకసారి గెలిచి, మరోసారి ఓడిపోయిన నాయకురాలి మీద ఇంతగా ఫోకస్ చేయడమే ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతున్న అనిత తెలుగు మహిళ అధ్యక్షురాలు కూడా. ఆ హోదాలో అధికార పార్టీని, ముఖ్య నాయకత్వాన్ని రాజకీయంగా తీవ్రంగా టార్గెట్ చేసేవారామె. ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేవి. ఫైర్ బ్రాండ్ ఇమేజ్తో ఇటీవల దూకుడు పెంచిన అనిత వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో వాతావరణం వేడెక్కుతోంది.
Also Read
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
- Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
- Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
2014లో విజయం సాధించాక తక్కువ కాలంలోనే పార్టీలో ఆమె మీద తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అంతర్గత విభేదాల కారణంగా 2019లో కొవ్వూరు నుంచి పోటీ చేసిన అనితకు పరాజయం తప్పలేదు. ఓటమి తర్వాత తిరుగుటపాలో పాయకరావుపేటకు వచ్చేసిన మాజీ ఎమ్మెల్యే గత ఐదేళ్ళుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఓడించి తీరాలన్న టార్గెట్తో లోకల్గా పావులు కదుపుతోందట వైసీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ఊహించని ప్రమోష న్ ఇచ్చింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచారాయన. తర్వాత అనిత మీద పోటీకి సీనియర్ ఎమ్మెల్యే కంబాల జోగులును సిద్ధం చేసింది. వివాద రహితుడైన సీనియర్ శాసనసభ్యుణ్ణి బరిలోకి దించడం ద్వారా గట్టి పోటీ ఖాయమన్న సంకేతాలు పంపించింది. నియోజకవర్గంలో కోటవురట్ల, పాయకరావుపేట, ఎస్.రాయవరం,నక్కపల్లి మండలాలు వున్నాయి. ఎస్సీ, కాపు, మత్స్యకార, ఇతర బీసీ కులాల ఆధిపత్యం ఎక్కువ. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న ఇక్కడి ఓటర్లను గత ఎన్నికల్లో పూర్తిగా తన వైపు తిప్పుకుంది వైసీపీ. ఆ బలంతోపాటు ఎక్స్ట్రాగా సీనియర్స్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెపుతోంది. పాయకరావుపేట మండలంపై మంత్రి దాడిశెట్టి రాజా ఫోక స్ చేశారు. కోటవురట్లపై పట్టున్న మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుకు MSME కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్కు పాయకరావుపేట నియోజకర్గ బాధ్యతలను ప్రత్యేకంగా అప్పగించింది అధిష్టానం. తాము గెలవాలన్నదానికంటే ప్రత్యర్థిని ఓడించాలన్న కసిగా పని చేస్తున్నారట లోకల్ లీడర్స్. కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో ఈసారి జనసేన ప్రభావంపై కూడా చర్చ జరుగుతోంది. అధికార పార్టీ వైఖరిని గమనించిన ప్రతిపక్షం కూడా అలర్ట్ అయి అనితకు మద్దతుగా సేనల్ని మోహరిస్తోందట. నియోజకవర్గ బాధ్యతలను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకున్నారు. గ్రూప్ రాజకీయాలను కట్టడి చేసే దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అనిత నాయకత్వాన్ని వ్యతి రేకిస్తున్న జనసేన, టీడీపీ ద్వితీయ శ్రేణిని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారట గంటా. ఈ పరిణామాలతో ఈసారి పాయకరావుపేట పోరు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!