Off The Record: తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా..?
- 35 లక్షలు దాటిన తెలంగాణ బీజేపీ సభ్యత్వం..
- లోక్సభ ఎన్నికల ఊపు తగ్గకుండా జాగ్రత్తలు..
- సంస్థాగత ఎన్నికలతో క్షేత్ర స్థాయిలో బలపడే ప్లాన్స్..
- కనీసం 25వేల పోలింగ్ బూత్ కమిటీలు వేసే ఆలోచన..
- స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేసే ప్రణాళికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ బీజేపీ నాయకత్వం గతంలో ఎన్నడూ చేయనంత సభ్యత్వాన్ని చేయించింది ఈసారి. పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని అంటున్నారు బీజేపీ నేతలు. అంతే కాదు ప్రస్తుతం అన్ని స్థాయిల్లో కమిటీలు వేసుకునే అర్హత కూడా వచ్చిందట రాష్ట్ర పార్టీకి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయి ఫలితాలు రాకున్నా… పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా సీట్లు, ఓట్లు వచ్చాయి తెలంగాణ బీజేపీకి. 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓట్లు పడటంతో… అదే ఊపు తగ్గకుండా ఇంకా పెంచాలనుకుంటోందట పార్టీ నాయకత్వం. సంస్థాగత ఎన్నికల ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతమై…లోక్ సభ ఎన్నికల్లో పడ్డ ఓట్లను కాపాడుకోవాలన్నది పార్టీ ప్లాన్గా తెలిసింది. ఆ క్రమంలోనే వీలైనన్ని ఎక్కువ పోలింగ్ బూత్లకు పార్టీ కమిటీలని వేయాలని కసరత్తు చేస్తోందట. తెలంగాణలో మొత్తం 36 వేల పోలింగ్ బూత్లు ఉంటే… కనీసం 25 వేలకైనా కమిటీలు వేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.
అయితే క్షేత్ర స్థాయిలో అలాంటి వాతావరణం ఉందా? కార్యకర్తలు ఆ మేరకు ఉత్సాహం చూపుతున్నారా అంటే… ఠక్కున ఎస్ అని చెప్పలేని పరిస్థితి పార్టీ వర్గాలది. అందుకే రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో సీరియస్గా ఉండాలనుకుంటోందట. బూత్ కమిటీలను తూతూ మంత్రంగా కాకుండా… స్థానిక సంస్థల ఎన్నికల్లో పనికి వచ్చేలా ఏర్పాటు చేయాలని కింది స్థాయి నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా బీజేపీకి అర్బన్ పార్టీ ఇమేజ్ ఉండేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అది కాస్త మారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పుంజుకుంటున్న సూచనలు కనిపించాయి. అందుకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్ని లైట్ తీసుకోకుండా… సీరియస్గా వర్కౌట్ చేయాలని నిర్ణయించారట పార్టీ పెద్దలు. అందుకే…ఈటల రాజేందర్ లాంటి సీనియర్స్తో ఒక పార్టీ కమిటీని కూడా వేశారట. సంస్థాగత ఎన్నికలను డిసెంబర్లో పూర్తి చేయాలన్న ప్లాన్లో ఉంది తెలంగాణ బీజేపీ. బూత్ కమిటీ నుంచి రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక వరకు పూర్తి చేయాలని అనుకుంటోందట. ఆలస్యం అవకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది పార్టీ. తాము ఎంత సీరియస్గా ఉన్నామో ఈ వర్క్షాప్ ద్వారా తెలియ చేసే ప్రయత్నం చేస్తోందట రాష్ట్ర నాయకత్వం. సంస్థాగత ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలకు స్ప్రింగ్ బెంచ్ గా ఉపయోగించుకోవాలన్నది తెలంగాణ కమలనాధుల ప్లాన్గా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాలకే పరిమితం అనే మార్క్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డాంగనుక… ఇక మాస్ ఇమేజ్తో రూరల్ ఏరియాల్లో పాతుకుపోవాలన్న కాషాయ దళం ప్లాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!