Off The Record: తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా..?
- 35 లక్షలు దాటిన తెలంగాణ బీజేపీ సభ్యత్వం..
- లోక్సభ ఎన్నికల ఊపు తగ్గకుండా జాగ్రత్తలు..
- సంస్థాగత ఎన్నికలతో క్షేత్ర స్థాయిలో బలపడే ప్లాన్స్..
- కనీసం 25వేల పోలింగ్ బూత్ కమిటీలు వేసే ఆలోచన..
- స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేసే ప్రణాళికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ బీజేపీ నాయకత్వం గతంలో ఎన్నడూ చేయనంత సభ్యత్వాన్ని చేయించింది ఈసారి. పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని అంటున్నారు బీజేపీ నేతలు. అంతే కాదు ప్రస్తుతం అన్ని స్థాయిల్లో కమిటీలు వేసుకునే అర్హత కూడా వచ్చిందట రాష్ట్ర పార్టీకి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయి ఫలితాలు రాకున్నా… పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా సీట్లు, ఓట్లు వచ్చాయి తెలంగాణ బీజేపీకి. 8 ఎంపీ సీట్లు, 35 శాతం ఓట్లు పడటంతో… అదే ఊపు తగ్గకుండా ఇంకా పెంచాలనుకుంటోందట పార్టీ నాయకత్వం. సంస్థాగత ఎన్నికల ద్వారా క్షేత్ర స్థాయిలో బలోపేతమై…లోక్ సభ ఎన్నికల్లో పడ్డ ఓట్లను కాపాడుకోవాలన్నది పార్టీ ప్లాన్గా తెలిసింది. ఆ క్రమంలోనే వీలైనన్ని ఎక్కువ పోలింగ్ బూత్లకు పార్టీ కమిటీలని వేయాలని కసరత్తు చేస్తోందట. తెలంగాణలో మొత్తం 36 వేల పోలింగ్ బూత్లు ఉంటే… కనీసం 25 వేలకైనా కమిటీలు వేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.
అయితే క్షేత్ర స్థాయిలో అలాంటి వాతావరణం ఉందా? కార్యకర్తలు ఆ మేరకు ఉత్సాహం చూపుతున్నారా అంటే… ఠక్కున ఎస్ అని చెప్పలేని పరిస్థితి పార్టీ వర్గాలది. అందుకే రాష్ట్ర నాయకత్వం ఈ విషయంలో సీరియస్గా ఉండాలనుకుంటోందట. బూత్ కమిటీలను తూతూ మంత్రంగా కాకుండా… స్థానిక సంస్థల ఎన్నికల్లో పనికి వచ్చేలా ఏర్పాటు చేయాలని కింది స్థాయి నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా బీజేపీకి అర్బన్ పార్టీ ఇమేజ్ ఉండేది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అది కాస్త మారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పుంజుకుంటున్న సూచనలు కనిపించాయి. అందుకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్ని లైట్ తీసుకోకుండా… సీరియస్గా వర్కౌట్ చేయాలని నిర్ణయించారట పార్టీ పెద్దలు. అందుకే…ఈటల రాజేందర్ లాంటి సీనియర్స్తో ఒక పార్టీ కమిటీని కూడా వేశారట. సంస్థాగత ఎన్నికలను డిసెంబర్లో పూర్తి చేయాలన్న ప్లాన్లో ఉంది తెలంగాణ బీజేపీ. బూత్ కమిటీ నుంచి రాష్ర్ట అధ్యక్ష ఎన్నిక వరకు పూర్తి చేయాలని అనుకుంటోందట. ఆలస్యం అవకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది పార్టీ. తాము ఎంత సీరియస్గా ఉన్నామో ఈ వర్క్షాప్ ద్వారా తెలియ చేసే ప్రయత్నం చేస్తోందట రాష్ట్ర నాయకత్వం. సంస్థాగత ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికలకు స్ప్రింగ్ బెంచ్ గా ఉపయోగించుకోవాలన్నది తెలంగాణ కమలనాధుల ప్లాన్గా తెలుస్తోంది. పట్టణ ప్రాంతాలకే పరిమితం అనే మార్క్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డాంగనుక… ఇక మాస్ ఇమేజ్తో రూరల్ ఏరియాల్లో పాతుకుపోవాలన్న కాషాయ దళం ప్లాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
Also Read
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
- CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
- India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
- Earthquakes: ఒక భూకంపం మరో భూకంపాన్ని ప్రేరేపిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనల వెనుక అసలు కారణం ఇదే..!
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!