Off The Record: తెలంగాణ బీజేపీ దూకుడు పెంచుతుందా..? పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా..?
- తెలంగాణ ప్రజా ప్రతినిధులతో ప్రధాని భేటీ..
- కేడర్కు పాజిటివ్ సంకేతం పంపడానికేనా?..
- ఈ మీటింగ్ వెనక ప్రత్యేకమైన లెక్కలు ఉన్నాయా?..
- తెలంగాణ మీద హై కమాండ్ ఫోకస్ పెరగబోతోందా?..
- అందర్నీ కలిపేందుకే మోడీతో మీటింగ్ జరిగిందా?..
Off The Record: తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తొలిసారి భేటీ అయ్యారు ప్రధాని మోడీ. ఇన్నాళ్ళు లేనిది మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. పార్టీ టార్గెట్లో ఉన్న తెలంగాణ ప్రజా ప్రతినిధులతో సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ మీటింగ్ ద్వారా ఆయన రాష్ట్ర పార్టీ కేడర్కు ఆయన ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదేమీ ఆషామాషీగా జరిగి ఉండదని, బీజేపీలో ఇలాంటి మీటింగ్స్ జరగడానికి కొన్ని ప్రత్యేకమైన లెక్కలు ఉంటాయని, ఆ కోణంలోనే తెలంగాణ ప్రతినిధులతో భేటీ అయి ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణపై గట్టి ఆశలే పెట్టుకుంది బీఆర్ఎస్. అయితే… గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. కానీ, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 8ఎంపీ సీట్లు గెల్చుకుంది. ఇక ఆ ఊపుతో.. ఇప్పటికైనా తెలంగాణలో సంస్థాగతంగా బలోపేతం కావాలని చూస్తోందట బీజేపీ. నేతల మధ్య సమన్వయం లేక పోవడం వల్లే రాష్ట్రంలో వెనకబడుతున్నామని, అదే పార్టీకి పెద్ద మైనస్ అని గుర్తించారట.
Read Also: Realme C75: రియల్ మీ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
Also Read
ఈ విషయం మోడీ దృష్టికి కూడా వెళ్ళిందని, ఆ క్రమంలోనే పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలుస్తోంది. కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న రాజాసింగ్ కూడా మోడీతో మీటింగ్కు హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే… అంతా విభేదాలు వీడి.. ఇక నుంచి కలిసి పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పవర్ దిశగా పార్టీని సిద్ధం చేయమని చెప్పినట్టయిందని అంటున్నారు. మీటింగ్లో అందరి యోగ క్షేమాలు అడిగిన మోడీ… కలసి మెలసి పని చేయండని చెప్పారట. కష్టపడి పని చేయండి…. ఈసారి తెలంగాణలో మన ప్రభుత్వమే అధికారంలోకి రావాలని గట్టిగా చెప్పడంతో ఇక రాష్ట్ర పార్టీలో కదలిక వస్తుందని అనుకుంటున్నారట నాయకులు. తెలంగాణ అభివృద్దికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాని చెప్పినట్టు తెలిసింది. ఈ మీటింగ్ ద్వారా ఇక నుంచి తెలంగాణపై తమ ఫోకస్ ఉంటుందని బీజేపీ పెద్దలు చెప్పకనే చెప్పారన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆ సంకేతం పంపడానికే ప్రత్యేకించి ఇప్పుడు మీటింగ్ పెట్టినట్టు మాట్లాడుకుంటున్నారు. మొత్తం మీద మోడీ మీటింగ్తో ఇప్పటికైనా తెలంగాణ బీజేపీలో ఐక్యత వస్తుందా? నేతలు సమన్వయంతో దూకుడుగా వెళ్తారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో