Off The Record: ఆమదాలవలసలో తమ్మినేని సీతారామ్కు సెగలు
Off The Record: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్కు సొంత నియోజకవర్గం ఆమదాలవలసలో సెగలు రేగుతున్నాయట. ఇన్నాళ్ళు సెగ్మెంట్లో బలమైన నేతగా ఉన్న తమ్మినేనికి ఇప్పుడు సొంత సామాజిక వర్గం నేతలే ఎర్త్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న్టటు తెలిసింది. 2019 ఎన్నికల తరువాత సైలెంట్గా ఉన్న అసమ్మతి నేతలు ఇటీవల యాక్టివ్ అయ్యారని, అందుకే వారు ఎమ్మెల్యేతో అంటీ ముట్టనట్టుగా ఉన్నారన్నది లోకల్ టాక్. స్థానిక వైసిపి సీనియర్ నేతలు సువ్వారి గాంధీ , చింతాడ రవికుమార్ తోపాటు కోటా బ్రదర్స్ సమాంతర రాజకీయం నడుపుతూ… ఆయనకు సవాల్ విసురుతున్నారట. ఆమదాల వలస వైసీపీలో రెబెల్స్ మూడు గ్రూపులుగా ఉన్నారు. వీళ్లందర్నీ ఒకతాటి మీదికి తీసుకువచ్చి తాను నాయకత్వం బాధ్యతలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట సువ్వారి గాంధీ. అధిష్టానానికి అభ్యర్థిని మార్చాలన్న ఆలోచన వస్తే… ఆ ఛాయిస్ తానే కావాలన్నది ఆయన ప్లాన్.
ఈ ఎత్తులు, పై ఎత్తులతో నియోజకవర్గ పార్టీ కేడర్లో గందరగోళం పెరుగుతుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే… ఇక్కడ వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవడం అంత తేలికకాదని వైసిపి క్యాడరే అంటోందట. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా మండలాల వారిగా విడిపోయి మీది సువ్వారి వర్గం , మాది తమ్మినేని వర్గం అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. బర్త్ డేల పేరుతో బల ప్రదర్శలు జరుగుతున్నాయి. గతంలో కోట బ్రదర్స్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించి తమ్మినేనికి సవాలు విసిరారు. తర్వాత సువ్వారి గాంధీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు బర్త్ డే పేరుతో ఆత్మీయ సమావేశం పెట్టారు. పొందూరు , సరుబుజ్జిలి , బూర్జ , ఆమదాలవలస మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసిపి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది చూస్తున్న వారంతా అసమ్మతి గ్రూపులను కట్టడి చేయటంలో విఫలమైన తమ్మినేని రాజకీయంగా సవాల్ ఎదుర్కొంటున్నారని కామెంట్ చేస్తున్నారు.
Also Read
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
ఈసారి ఎన్నికల్లో తమ్మినేనికి కాకుండా ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుస్తామని అంటున్నారు రెబెల్స్ సువ్వారి గాంధీ , చింతాడ రవికుమార్. ఆ అసమ్మతి గ్రూపుల నేతలు ధర్మాన ప్రసాదరావుతో కలిసి మంత్రాంగం నడపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన ట్విస్ట్. మరో వైపు వైసీపీ అంతర్గత విభేదాలు…. టీడీపీకి కలిసి వస్తున్నాయట. ఇక్కడ ప్రతిపక్ష కేడర్ ఇప్పటికీ బలంగానే ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మూడు ముక్కలాటతో వైసీపీ సతమతం అవుతుంటే… దాన్ని అనుకూలంగా మలుచుకుని పాగా వేసే దిశగా తెలుగుదేశం వ్యూహాలు సిద్దం చేసుకుంటోందట. ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!