Off The Record: ఒవైసీల ఫ్యామిలీ నుంచి మూడో తరం అరంగేట్రం.. వారసుడొచ్చాడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఒవైసీల కుటుంబం నుంచి మరో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడో తరం నాయకుడు నూరుద్దీన్ ఒవైసీని బరిలో దింపేందుకు గ్రౌండ్ సిద్ధమవుతోంది. మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడే నూరుద్దీన్. అక్బర్ సోదరుడు, పార్టీ అధినేత అసదుద్దీన్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. తమకు తిరుగులేని పట్టున్న చార్మినార్ నియోజకవర్గం నుంచే వారసుడితో పొలిటికల్ అరంగేట్రం చేయించాలనుకుంటున్నా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. అధినేత వారసుడి కోసం సీటు వదులుకునేందుకు అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సిద్ధంగా లేకపోవడమే అందుకు కారణం అంటున్నారు.
Read Also: Minister Talasani: శ్రీరాముడుపై ఒట్టేసి ఆరోపణలు రుజువు చేస్తారా.. బీజేపీకి తలసాని సవాల్
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచి తాను తప్పుకోవాల్సి వస్తే.. పక్కనే ఉన్న యాకుత్పుర సీటు ఇవ్వాలని కోరుతున్నారాయన. యాకుత్పుర నుంచి గతంలో వరుసగా ఐదుసార్లు గెలిచారు ముంతాజ్. ప్రస్తుతం యాకుత్పుర సిట్టింగ్ ఎమ్మెల్యేగా అహ్మద్ పాషా ఖాద్రీ అనారోగ్యం కారణంగా ఈ సారి ఎన్నికల్లో పోటీచేయట్లేదు. అదే సమయంలో నాంపల్లిలో తీవ్రమైన పోటీ ఉన్నందున అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ను యాకుత్పురాకు మార్చి.. నాంపల్లిలో మాజీ మేయర్ మాజిద్ హుసేన్ను బరిలో నిలపాలని పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.
Read Also: Rebel: ప్రభాస్ టైటిల్ తో వస్తున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
ఇప్పుడు ముంతాజ్ఖాన్కు యాకుత్పుర ఇస్తే.. నాంపల్లి నుంచి జాఫర్, మాజిద్ హుసేన్లో ఒక్కరికే అవకాశం ఉంటుంది. ఈ విషయమై అక్బరుద్దీన్ ఇప్పటికే ముంతాజ్ ఖాన్తో చర్చించారట. అయితే.. యాకుత్పుర ఇస్తేనే చార్మినార్ను వదులుకుంటానని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు తెలిసింది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో ఒవైసీల మూడో తరం పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనే నూరుద్దీన్ను బరిలో దింపాలనుకున్నా.. అప్పుడు ఆయనకు వయసు చాల్లేదని ఆగినట్టు తెలిసింది. ఇప్పుడు నూరుద్దీన్ ఒవైసీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. ఒవైసీల ఫ్యామిలీ నుంచి మూడో తరం రాజకీయాల్లోకి వచ్చినట్టు అవుతుంది.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!