Minister Talasani: శ్రీరాముడుపై ఒట్టేసి ఆరోపణలు రుజువు చేస్తారా.. బీజేపీకి తలసాని సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ పార్టీకి అంబర్ పేట్ లో బీఆర్ఎస్ వరుస షాకులు ఇస్తుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి కమలం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు జాయిన్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులపై అమ్ముడు పోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికి మాలినవని ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోకూడది మంత్రి తలసాని అన్నారు. మాటెత్తితే జైశ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడుపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అని సవాల్ చేశారు.
Read Also: Rebel: ప్రభాస్ టైటిల్ తో వస్తున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
Also Read
- Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ఇదే, అంబర్ పేట్ లో కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేతిలో ఓడిపోవడంతో అదృస్టం కలిసొచ్చి ఎంపీవి అయ్యి ఆ తర్వాత క్యాబినెట్ మినిస్టర్ వి అయ్యి ఒక్కసారి కూడా నియోజకవర్గం వైపు మళ్లీ చూసిన పాపాన పోలేదు.. ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పాలని మంత్రి తలసాని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చే సరికి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చి ఓట్లు అడ్డుకొని గెలిచిన వెంటనే ఢిల్లీ కి కిషన్ రెడ్డి వెళ్లిపోతాడని ఆయన ఆరోపించారు. అంబర్ పేట్ ప్రజలు మరోసారి చిత్తుచిత్తుగా కిషన్ రెడ్డిని ఓడిస్తారన్న భయంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మీరు ఎమ్మెల్యేగా చేసిన హయాంలో జరిగిన అభివృద్ధికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు.
Read Also: NIA Court: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు.. 11 మందికి పదేళ్లు జైలు శిక్ష
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును చూసే పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. అంబర్ పేట్ లో గత 20 సంవత్సరాల్లో ఒక్క కార్యకర్తను నాయకుడిని పట్టించుకోకపోవడం వల్లే నేడు బీజేపీలో పోటీ చేయడానికి ఒక్క నాయకుడు లేకుండా పోయారని ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి అత్యంత స్వార్థపరుడు.. అన్ని పదవులు తనకే కావాలన్న దురాశ కలిగిన వ్యక్తి అంటూ ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ, క్యాబినెట్ మినిస్టర్ నుంచి పార్టీ అధ్యక్షుడు వరకు అన్ని తనకే కావాలంటే పార్టీని నమ్ముకొని 40 సంవత్సరాలుగా పని చేస్తున్న నాయకులు ఎమ్ కావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!