Minister Talasani: శ్రీరాముడుపై ఒట్టేసి ఆరోపణలు రుజువు చేస్తారా.. బీజేపీకి తలసాని సవాల్
బీజేపీ పార్టీకి అంబర్ పేట్ లో బీఆర్ఎస్ వరుస షాకులు ఇస్తుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి కమలం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు జాయిన్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ లో చేరుతున్న నాయకులపై అమ్ముడు పోయారని బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ పనికి మాలినవని ఏనుగులు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయని వాటిని పట్టించుకోకూడది మంత్రి తలసాని అన్నారు. మాటెత్తితే జైశ్రీరామ్ అనే మీరు అదే శ్రీరాముడుపై ఒట్టేసి మీరు చేస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుంటారా అని సవాల్ చేశారు.
Read Also: Rebel: ప్రభాస్ టైటిల్ తో వస్తున్న కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇదే, అంబర్ పేట్ లో కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేతిలో ఓడిపోవడంతో అదృస్టం కలిసొచ్చి ఎంపీవి అయ్యి ఆ తర్వాత క్యాబినెట్ మినిస్టర్ వి అయ్యి ఒక్కసారి కూడా నియోజకవర్గం వైపు మళ్లీ చూసిన పాపాన పోలేదు.. ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పాలని మంత్రి తలసాని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చే సరికి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చి ఓట్లు అడ్డుకొని గెలిచిన వెంటనే ఢిల్లీ కి కిషన్ రెడ్డి వెళ్లిపోతాడని ఆయన ఆరోపించారు. అంబర్ పేట్ ప్రజలు మరోసారి చిత్తుచిత్తుగా కిషన్ రెడ్డిని ఓడిస్తారన్న భయంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. మీరు ఎమ్మెల్యేగా చేసిన హయాంలో జరిగిన అభివృద్ధికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నానని కిషన్ రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు.
Read Also: NIA Court: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు.. 11 మందికి పదేళ్లు జైలు శిక్ష
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును చూసే పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. అంబర్ పేట్ లో గత 20 సంవత్సరాల్లో ఒక్క కార్యకర్తను నాయకుడిని పట్టించుకోకపోవడం వల్లే నేడు బీజేపీలో పోటీ చేయడానికి ఒక్క నాయకుడు లేకుండా పోయారని ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి అత్యంత స్వార్థపరుడు.. అన్ని పదవులు తనకే కావాలన్న దురాశ కలిగిన వ్యక్తి అంటూ ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీ, క్యాబినెట్ మినిస్టర్ నుంచి పార్టీ అధ్యక్షుడు వరకు అన్ని తనకే కావాలంటే పార్టీని నమ్ముకొని 40 సంవత్సరాలుగా పని చేస్తున్న నాయకులు ఎమ్ కావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!