Off The Record: అసెంబ్లీ బరిలో వైసీపీ ఎంపీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం…. ఒంగోలుకు కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ దీని పార్లమెంట్ పరిధి మాత్రం బాపట్లలో ఉంటుంది. ఒంగోలుకు దగ్గర కావడంతో జిల్లా పరిధి ప్రకాశంలోనే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచారు. మొదట్లో బాగానే ఉన్నా… ఆ తర్వాత అధికారుల బదిలీలు, తనకు నచ్చిన వారికి పనుల కేటాయింపు లాంటి కారణాలతో ద్వితీయ శ్రేణి నేతలతో ఎమ్మెల్యేకు గ్యాప్ పెరిగిందట. చీమకుర్తి మినహా మిగిలిన అన్ని మండలాల్లోని ద్వితీయ శ్రేణి నేతలతో ఆయనకు చెడిందట. నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల్లో ఎమ్మెల్యే తీరు నచ్చక కులాల వారీగా గ్రూపులు కట్టారట వైసీపీ నేతలు. దీంతో ఈసారి ఆయనకు సీటు ఇచ్చినా…గెలుపు డౌటేనన్న టాక్ మొదలైందట నియోజకవర్గంలో. అవినీతి ఎమ్మెల్యే మాకొద్దు.. కొత్త సమన్వయకర్త ముద్దంటూ సుధాకర్బాబుకు వ్యతిరేకంగా నాలుగు మండలాల్లోని వైసీపీ కార్యకర్తలు అధిష్టానానికి లేఖలు రాయడం, నియోజకవర్గంలో పోస్టర్లు వేయటం కలకలం రేపింది. దీంతో పాటు స్థానిక ఎస్సీ నేతలు ఇటీవల బాపట్ల ఎంపీ నందిగం సురేష్ని కలవటం చర్చనీయాంశంలా మారిందట.. నాలుగు మండలాలకు చెందిన దాదాపు వంద మందికి పైగా నేతలు ఎంపీని కలిసి సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తే తమ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారట.
బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేయటానికి ఆసక్తిగా ఉన్నారని ప్రచారంలో ఉండటం, అందుకు తగ్గట్టుగానే.. ఆయన సామాజిక వర్గానికే చెందిన వైసీపీ నాయకులు భేటీ కావటంతో ఇక ప్రచారం జోరందుకుంటోందట. ఎస్సీలతో పాటు ఇతర సామాజిక వర్గ నేతలు కూడా సుధాకర్బాబుకు బదులుగా నందిగం సురేష్ వస్తే… తమకేం ఇబ్బంది లేదని అంటున్నారట.
పైగా.. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులంతా ఆయన తప్ప ఇంకెవరైనా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారట. ఎంపీ సురేష్ అయితే నియోజకవర్గ ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి పని తేలిక అవుతుందని చెబుతోందట ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం. మరోవైపు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా ఏ చిన్న అవకాశం దొరికినా తన సీటును నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.. తానే పోటీలో ఉంటానని, కంగారు పడాల్సిన పని లేదని తన అనుచరులకు చెప్పుకుంటున్నారట.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఎంపీ సురేష్ ఈసారి అసెంబ్లీ బరిలోనే నిలుస్తారని ఆయన వర్గీయులు చెబుతుండటంతో సంతనూతలపాడు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువన్నది లోకల్ టాక్. ఎంపీ మనసులో ఏముందనేది ఇంత వరకూ స్పష్టత లేకున్నా…జరుగుతున్న ప్రచారం మాత్రం ఎమ్మెల్యే సుధాకర్ బాబును కలవరపెడుతోందట. ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లు ఖరారు చేసే వైసీపీ అధినాయకత్వం సంతనూతలపాడు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!