Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Mp Magunta Srinivasulu Reddy

Off The Record: సిట్టింగ్ ఎంపీకి ఈసారి టికెట్ డౌటేనా? వైసీపీ పరిశీలిస్తున్న పేర్లేంటి?

Published Date :June 24, 2023 , 11:04 pm
By Sudhakar Ravula
Off The Record: సిట్టింగ్ ఎంపీకి ఈసారి టికెట్ డౌటేనా? వైసీపీ పరిశీలిస్తున్న పేర్లేంటి?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Off The Record: సీనియర్ పొలిటీషియన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇప్పుడు బ్యాడ్‌ టైం నడుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస వివాదాలు ఆయన్ని వెంబడిస్తున్నాయి. దాదాపు పాతికేళ్ళ నుంచి రాజకీయం చేస్తున్న మాగుంటకు వివాదాల జోలికి పోడన్న పేరుంది. కానీ… ఈ దఫా ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డితో రాజకీయ అరంగ్రేటం చేయించాలని చేస్తున్న ప్రయత్నాలకు పురిట్లోనే సంధికొడుతోందట. గతంలో తన తండ్రి అందుబాటులో లేని సమయంలో రాఘవరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. దానిపై పలువురు ఎమ్మెల్యేలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు నేరుగా ఎంపీకే చెప్పేశారట. దీంతో ఆయనను వ్యాపారాలకే పరిమితం చేశారు శ్రీనివాసరెడ్డి. అలా వ్యాపార వ్యవహారాలు చూసుకునే క్రమంలోనే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఇరుక్కున్నారు రాఘవరెడ్డి.

తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి మరణం తర్వాత 1998లో ఒంగోలు లోక్‌సభ నుంచి పోటీ చేసి గెలిచారు శ్రీనివాసులరెడ్డి. 1998, 2004, 2009లలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున, 2019లో వైసీపీ తరఫున మొత్తం నాలుగు సార్లు ఎంపీ అయ్యారాయన. 2014లో టీడీపీలో చేరిన మాగుంట ఎంపీగా ఓడారు. తర్వాత ఆ పార్టీ నుంచే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తన వర్గాన్ని ఏర్పరచుకుని తాను ఏ పార్టీలో ఉన్నా వారిని కాపాడుకుంటు వస్తున్నారు మాగుంట. ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం జరగడం, తాను మారటం లేదని వివరణ ఇవ్వడం ఇటీవల పరిపాటి అయింది. ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని వైసీపీ తరపున ఒంగోలు లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయించాలని పావులు కదుపుతుండగానే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టవడం పెద్ద దెబ్బేనని అంటున్నారు. నేరాన్ని అంగీకరిస్తే రాఘవరెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలున్నా. చేయని తప్పును ఒప్పుకుంటే…తర్వాత రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, అందుకే బెయిల్‌ వచ్చేదాకా రాఘవ జైల్‌లోనే ఉంటారని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట శ్రీనివాసుల రెడ్డి.

Also Read

  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Add as a preferred
source on google

అయితే అదే సమయంలో వైసీపీ అధిష్టానం ఆలోచన మరోలా ఉన్నట్టు తెలిసింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఓకే… ఎక్కడన్నా తేడాకొట్టి ఎన్నికల నాటికి మాగుంట కుటుంబం పోటీ చేయలేని పరిస్థితి వస్తే… ఏంటన్నది అధినాయకత్వపు ఆలోచనగా చెబుతున్నారు. అందుకే మాగుంటకు ప్రత్యామ్నాయాన్ని వెదికే పనిలో ఉన్నట్టు సమాచారం. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఇక్కడ పోటీకి సుముఖంగా ఉన్నా… ఆయన సొంత బావమరిది, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో విభేదాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వాటి ప్రభావం పార్టీ మీద పడి ఎన్నికల్లో నష్టం కలగవచ్చన్న అభిప్రాయం నాయకత్వానికి ఉంది. అందుకే సుబ్బారెడ్డి అభ్యర్థిత్వంపై అధిష్టానం అంత సుముఖంగా లేనట్టు తెలిసింది. ఒకవేళ కాదు కూడదని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి వైవీని పోటీలో దింపినా…తర్వాత మనసులు కలవకుంటే…ఇబ్బంది లేని చోట టఫ్‌ ఫైట్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచన కూడా వైసీపీ పెద్దలకు ఉందట. ఒంగోలు లోక్‌సభ సీటుకు ప్రత్యర్థుల నుంచి చెప్పుకోతగ్గ అభ్యర్థులు లేనందున ఇప్పటికిప్పుడు టెన్షన్‌ పడి ఎవరో ఒకరి పేరు చెప్పాల్సిన అవసరం లేదన్నది వైసీపీ అధినాయకత్వపు ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు మాగుంట కూడా సీఎం జగన్‌కు అన్ని విషయాలు చెప్పామని, కాంట్‌ బట్‌ సిట్యుయేషన్‌ వచ్చినప్పుడు చూద్దామనుకుంటున్నట్టు తెలిసింది. పైకి గంభీరంగా చెబుతున్నా… లోలోపల మాత్రం ఆ రోజుకు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ మాగుంటలో ఉందన్నది సన్నిహితుల మాట. పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయం చూసుకుంటుందా? లేక టెన్షన్‌ లేకుండా సిట్టింగే మళ్ళీ బరిలో దిగుతారా అన్నది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • MP Magunta Srinivasulu Reddy
  • off the record
  • YSRCP

తాజావార్తలు

  • CM Revanth Reddy : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!

  • Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’

  • Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!

  • Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు

  • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions