Off The Record: ఆ నియోజకవర్గంలో ఈటల వ్యూహం ఏంటి..? ఆ నేతకు చెక్ పెడతారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పరకాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఈసారి ఇక్కడ పార్టీని గెలిపించి తన పంతం నెగ్గించుకోవాలని కసిగా ఉన్నారాయన. బీఆర్ఎస్ సిట్టింగ్ చల్లా ధర్మారెడ్డికి చెక్ పెట్టేందుకు కొత్త అభ్యర్థిని బరిలో దింపడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయినట్టు తెలిసింది. స్థానికంగా పేరున్న డాక్టర్ కాళిప్రసాద్ బీజేపీకి దగ్గరయ్యారు. స్థానికుడైన కాళీప్రసాద్ వైద్యవృత్తితో నియోజకవర్గ ప్రజలకు చిర పరిచితుడే. పైగా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇది పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట ఈటల. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈటల ఓటమికోసం విశ్వప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది.
ఈసారి దీటైన అభ్యర్థిగా కాళీ ప్రసాద్ను రంగంలోకి దింపి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారట ఈటల. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సైతం కాళీప్రసాద్ రాకను స్వాగతిస్తున్నారు. తన ఇమేజికి తోడు పరకాల పట్టణంలో బీజేపీకి మంచి పట్టు ఉండడంతోపాటు, బడుగు బలహీనవర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట కాళీ ప్రసాద్. మున్నూరు కాపు అయిన డాక్టర్కు కొండా సురేఖ-మురళీ దంపతుల సహకారం సైతం అందుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా దంపతులకు రాజకీయ ప్రత్యర్థి అయిన చల్లాను ఓడించేందుకు డాక్టర్కు వాళ్ళ సహకారం ఉంటుందన్నది స్థానిక అంచనా. పరకాల నియోజకవర్గంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, సంగెం, దామెర మండలాలు ఉండగా … మొత్తం ఓటర్లు 2లక్షల 11వేల 660 మంది. అందులో ప్రధానంగా బీసీ సామాజికవర్గాలకు చెందిన ఓట్లు సుమారు 60శాతం ఉన్నాయి. ముదిరాజ్ల ఓట్లు 31వేలు, మున్నూరు కాపుల ఓట్లు 32వేలు, గౌడ్స్ 25వేలు, యాదవులకు 22వేలు, పద్మశాలీలకు 15వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది.
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
ఈటల రాజేందర్ మాటకు ముదిరాజ్ సామాజికవర్గం కట్టుబడి ఉంటుందని, అదే సమయంలో సొంత సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్న నమ్మకంతో డాక్టర్ కాళీప్రసాద్ ఉన్నారు. మొత్తం మీద అధికారికంగా ప్రకటించకున్నా… పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కాళీ ప్రసాద్ ఫిక్స్ అన్నది పార్టీ కేడర్ మాట. సామాజికవర్గాల సమీకరణలతో ఈసారి పోరు కూడా రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!