Off The Record: ఆ నియోజకవర్గంలో ఈటల వ్యూహం ఏంటి..? ఆ నేతకు చెక్ పెడతారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పరకాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఈసారి ఇక్కడ పార్టీని గెలిపించి తన పంతం నెగ్గించుకోవాలని కసిగా ఉన్నారాయన. బీఆర్ఎస్ సిట్టింగ్ చల్లా ధర్మారెడ్డికి చెక్ పెట్టేందుకు కొత్త అభ్యర్థిని బరిలో దింపడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయినట్టు తెలిసింది. స్థానికంగా పేరున్న డాక్టర్ కాళిప్రసాద్ బీజేపీకి దగ్గరయ్యారు. స్థానికుడైన కాళీప్రసాద్ వైద్యవృత్తితో నియోజకవర్గ ప్రజలకు చిర పరిచితుడే. పైగా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇది పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట ఈటల. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈటల ఓటమికోసం విశ్వప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది.
ఈసారి దీటైన అభ్యర్థిగా కాళీ ప్రసాద్ను రంగంలోకి దింపి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారట ఈటల. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సైతం కాళీప్రసాద్ రాకను స్వాగతిస్తున్నారు. తన ఇమేజికి తోడు పరకాల పట్టణంలో బీజేపీకి మంచి పట్టు ఉండడంతోపాటు, బడుగు బలహీనవర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట కాళీ ప్రసాద్. మున్నూరు కాపు అయిన డాక్టర్కు కొండా సురేఖ-మురళీ దంపతుల సహకారం సైతం అందుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా దంపతులకు రాజకీయ ప్రత్యర్థి అయిన చల్లాను ఓడించేందుకు డాక్టర్కు వాళ్ళ సహకారం ఉంటుందన్నది స్థానిక అంచనా. పరకాల నియోజకవర్గంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, సంగెం, దామెర మండలాలు ఉండగా … మొత్తం ఓటర్లు 2లక్షల 11వేల 660 మంది. అందులో ప్రధానంగా బీసీ సామాజికవర్గాలకు చెందిన ఓట్లు సుమారు 60శాతం ఉన్నాయి. ముదిరాజ్ల ఓట్లు 31వేలు, మున్నూరు కాపుల ఓట్లు 32వేలు, గౌడ్స్ 25వేలు, యాదవులకు 22వేలు, పద్మశాలీలకు 15వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఈటల రాజేందర్ మాటకు ముదిరాజ్ సామాజికవర్గం కట్టుబడి ఉంటుందని, అదే సమయంలో సొంత సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్న నమ్మకంతో డాక్టర్ కాళీప్రసాద్ ఉన్నారు. మొత్తం మీద అధికారికంగా ప్రకటించకున్నా… పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కాళీ ప్రసాద్ ఫిక్స్ అన్నది పార్టీ కేడర్ మాట. సామాజికవర్గాల సమీకరణలతో ఈసారి పోరు కూడా రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!