Off The Record: ఆ నియోజకవర్గంలో ఈటల వ్యూహం ఏంటి..? ఆ నేతకు చెక్ పెడతారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పరకాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఈసారి ఇక్కడ పార్టీని గెలిపించి తన పంతం నెగ్గించుకోవాలని కసిగా ఉన్నారాయన. బీఆర్ఎస్ సిట్టింగ్ చల్లా ధర్మారెడ్డికి చెక్ పెట్టేందుకు కొత్త అభ్యర్థిని బరిలో దింపడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయినట్టు తెలిసింది. స్థానికంగా పేరున్న డాక్టర్ కాళిప్రసాద్ బీజేపీకి దగ్గరయ్యారు. స్థానికుడైన కాళీప్రసాద్ వైద్యవృత్తితో నియోజకవర్గ ప్రజలకు చిర పరిచితుడే. పైగా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఇది పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట ఈటల. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈటల ఓటమికోసం విశ్వప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది.
ఈసారి దీటైన అభ్యర్థిగా కాళీ ప్రసాద్ను రంగంలోకి దింపి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారట ఈటల. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి సైతం కాళీప్రసాద్ రాకను స్వాగతిస్తున్నారు. తన ఇమేజికి తోడు పరకాల పట్టణంలో బీజేపీకి మంచి పట్టు ఉండడంతోపాటు, బడుగు బలహీనవర్గాల ఓట్లు ఎక్కువగా ఉండడం కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారట కాళీ ప్రసాద్. మున్నూరు కాపు అయిన డాక్టర్కు కొండా సురేఖ-మురళీ దంపతుల సహకారం సైతం అందుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా దంపతులకు రాజకీయ ప్రత్యర్థి అయిన చల్లాను ఓడించేందుకు డాక్టర్కు వాళ్ళ సహకారం ఉంటుందన్నది స్థానిక అంచనా. పరకాల నియోజకవర్గంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, సంగెం, దామెర మండలాలు ఉండగా … మొత్తం ఓటర్లు 2లక్షల 11వేల 660 మంది. అందులో ప్రధానంగా బీసీ సామాజికవర్గాలకు చెందిన ఓట్లు సుమారు 60శాతం ఉన్నాయి. ముదిరాజ్ల ఓట్లు 31వేలు, మున్నూరు కాపుల ఓట్లు 32వేలు, గౌడ్స్ 25వేలు, యాదవులకు 22వేలు, పద్మశాలీలకు 15వేలకు పైగా ఓటు బ్యాంకు ఉంది.
Also Read
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
- Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
ఈటల రాజేందర్ మాటకు ముదిరాజ్ సామాజికవర్గం కట్టుబడి ఉంటుందని, అదే సమయంలో సొంత సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్న నమ్మకంతో డాక్టర్ కాళీప్రసాద్ ఉన్నారు. మొత్తం మీద అధికారికంగా ప్రకటించకున్నా… పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కాళీ ప్రసాద్ ఫిక్స్ అన్నది పార్టీ కేడర్ మాట. సామాజికవర్గాల సమీకరణలతో ఈసారి పోరు కూడా రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు.
తాజావార్తలు
-
SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
-
Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
-
Virat Kohli: ఫైనల్ తర్వాత వైభవ్ను వెతుక్కుంటూ వెళ్లిన కోహ్లీ.. ఏం సలహా ఇచ్చాడో చూడండి..(వీడియో)
-
Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్కు గట్టి పోటీ
-
Dhurandhar 2: ఈ రోజు ఓటీటీలోకి స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’… ప్రశంసలు కురిపించిన అంబానీ.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!