Off The Record: నంద్యాలలో కూటమి పార్టీల కుమ్ములాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నంద్యాలలో టీడీపీకి ఎప్పటికప్పుడు ఒకదాని వెనక ఒకటిగా తలనొప్పులు పెరుగుతూనే ఉన్నాయట. పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ను ప్రకటించినప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్నారు ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి. ప్రచారంలో కూడా చంద్రబాబును సీఎంను చేయాలని చెబుతున్నా… అభ్యర్థి ఫరూక్ ను గెలిపించాలని మాత్రం అనడం లేదట. తాజాగా కూటమిలో జనసేన కో ఆర్డినేటర్… వైసీపీ కండువా కప్పుకున్నారు. జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ సెక్రెటరీ, నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ విశ్వనాధ్ కేడర్తో కలిసి ఫ్యాన్ కిందికి చేరిపోయారు. ఇక బీజేపీ కూడా నంద్యాలలో టీడీపీ అభ్యర్థితో కలసి పనిచేయడం లేదు. స్థానిక టీడీపీ ఇప్పటికే అంతర్గత గ్రూపు రాజకీయాలతో నలిగిపోతోంది. టిక్కెట్ రాలేదన్న కసితో ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి అభ్యర్థికి సరిగా సహకరించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఒక దశలో పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినా… ఆ తరువాత పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానం క్లాస్ తర్వాత ఫరూక్ , బ్రహ్మానంద రెడ్డి కామన్ మీడియా మీటింగ్ పెట్టి భుజం భుజం కలిపేస్తామని ప్రకటించేశారు. అది ఆ రోజుకే పరిమితమైంది తప్ప… ఆ తరువాత ఇద్దరూ కలిసింది లేదు. పనిచేసింది లేదు. పైగా భూమా బ్రహ్మానంద రెడ్డి రెబల్ గా బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నారట. టీడీపీ అంతర్గత వ్యవహారం అలా ఉంటే… మిగతా రెండు పార్టీల నేతలు కూడా ఎవరి దారిలో వారు ఉన్నారట. టీడీపీ తో కలసి పనిచేయడానికి బీజేపీ, జనసేన విముఖత చూపుతున్నట్టు తెలిసింది. కూటమి కో ఆర్డినేషన్ మీటింగ్ లో బీజేపీ నేత అభిరుచి మధు టీడీపీపై ఆరోపణలు చేశారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
తమను ఎన్నికల ప్రచారానికి ఎందుకు పిలవడం లేదంటూ టీడీపీ నేతలని ప్రశ్నించారు. అటు జనసేనదీ అదే తీరు. ఇప్పటి వరకు నంద్యాలలో టీడీపీ జనసేన కలిసి ప్రచారంచేసింది లేదు. ఇక జనసేన కో ఆర్డినేటర్ విశ్వనాథం ఏకంగా వైసీపీ లో చేరారు. టీడీపీ అభ్యర్థి ఫరూక్ తమను పట్టించుకోవడంలేదన్నది ఆయన ఆవేదన అట. కారణం ఏదైనా నంద్యాలలో టీడీపీకి మద్దతుగా బీజేపీ, జనసేన పనిచేయడం లేదన్నది వాస్తవం అంటున్నారు స్థానిక నేతలు. ఇది వ్యూహాత్మకమా, లేక స్థానిక నేతల వ్యక్తిగత కారణాలా అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాల మీద ఎంతవరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!