Off The Record: నంద్యాలలో కూటమి పార్టీల కుమ్ములాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నంద్యాలలో టీడీపీకి ఎప్పటికప్పుడు ఒకదాని వెనక ఒకటిగా తలనొప్పులు పెరుగుతూనే ఉన్నాయట. పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఫరూక్ను ప్రకటించినప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్నారు ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి. ప్రచారంలో కూడా చంద్రబాబును సీఎంను చేయాలని చెబుతున్నా… అభ్యర్థి ఫరూక్ ను గెలిపించాలని మాత్రం అనడం లేదట. తాజాగా కూటమిలో జనసేన కో ఆర్డినేటర్… వైసీపీ కండువా కప్పుకున్నారు. జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ స్టేట్ సెక్రెటరీ, నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ విశ్వనాధ్ కేడర్తో కలిసి ఫ్యాన్ కిందికి చేరిపోయారు. ఇక బీజేపీ కూడా నంద్యాలలో టీడీపీ అభ్యర్థితో కలసి పనిచేయడం లేదు. స్థానిక టీడీపీ ఇప్పటికే అంతర్గత గ్రూపు రాజకీయాలతో నలిగిపోతోంది. టిక్కెట్ రాలేదన్న కసితో ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి అభ్యర్థికి సరిగా సహకరించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
ఒక దశలో పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చినా… ఆ తరువాత పెద్దల జోక్యంతో వెనక్కి తగ్గారు. పార్టీ అధిష్టానం క్లాస్ తర్వాత ఫరూక్ , బ్రహ్మానంద రెడ్డి కామన్ మీడియా మీటింగ్ పెట్టి భుజం భుజం కలిపేస్తామని ప్రకటించేశారు. అది ఆ రోజుకే పరిమితమైంది తప్ప… ఆ తరువాత ఇద్దరూ కలిసింది లేదు. పనిచేసింది లేదు. పైగా భూమా బ్రహ్మానంద రెడ్డి రెబల్ గా బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నారట. టీడీపీ అంతర్గత వ్యవహారం అలా ఉంటే… మిగతా రెండు పార్టీల నేతలు కూడా ఎవరి దారిలో వారు ఉన్నారట. టీడీపీ తో కలసి పనిచేయడానికి బీజేపీ, జనసేన విముఖత చూపుతున్నట్టు తెలిసింది. కూటమి కో ఆర్డినేషన్ మీటింగ్ లో బీజేపీ నేత అభిరుచి మధు టీడీపీపై ఆరోపణలు చేశారు.
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
తమను ఎన్నికల ప్రచారానికి ఎందుకు పిలవడం లేదంటూ టీడీపీ నేతలని ప్రశ్నించారు. అటు జనసేనదీ అదే తీరు. ఇప్పటి వరకు నంద్యాలలో టీడీపీ జనసేన కలిసి ప్రచారంచేసింది లేదు. ఇక జనసేన కో ఆర్డినేటర్ విశ్వనాథం ఏకంగా వైసీపీ లో చేరారు. టీడీపీ అభ్యర్థి ఫరూక్ తమను పట్టించుకోవడంలేదన్నది ఆయన ఆవేదన అట. కారణం ఏదైనా నంద్యాలలో టీడీపీకి మద్దతుగా బీజేపీ, జనసేన పనిచేయడం లేదన్నది వాస్తవం అంటున్నారు స్థానిక నేతలు. ఇది వ్యూహాత్మకమా, లేక స్థానిక నేతల వ్యక్తిగత కారణాలా అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రభావం ఎన్నికల ఫలితాల మీద ఎంతవరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..