Off The Record: తెలంగాణలో ఎల్పీ విలీనాల పర్వం.. బీఆర్ఎస్లో భూకంపం..!?
- తెలంగాణలో ఎల్పీ విలీనాల పర్వం..
- గతంలో టీడీపీ ఎల్పీ బీఆర్ఎస్లో విలీనం..
- సీఎల్పీని కూడా కలిపేసుకున్న బీఆర్ఎస్..
- నాటి బీఆర్ఎస్ బాటలోనే నేడు కాంగ్రెస్..
- ఫిరాయింపులకు మీరే ఆద్యులంటూ రివర్స్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పార్టీ ఫిరాయింపులు, ఎల్పీల విలీనాలు తెలంగాణలో కొత్తేం కాదు. 2014 నుంచి 2023 వరకు ఇదే తంతు కొనసాగింది. అదేదో… ఆనవాయితీ అన్నట్టుగా… ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది. గతంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్… ఓసారి తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని, మరోసారి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తోవలో నడుస్తున్నట్టు కనబడుతోందంటున్నారు పరిశీలకులు.ఈసారి రాష్ట్లంలో అధికార మార్పిడి జరిగాక ఇప్పటివరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Read Also: Viral Video: ఇండియన్ ఫుడ్ తిన్న మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ విక్రేత..ఆస్పత్రి పాలయ్యాడు..
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
- LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
- CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
దీనిపై బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెడుతున్నా… కాంగ్రెస్ మాత్రం పిచ్చ లైట్ తీసుకుంటోంది. అసలు పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసింది, లేని ఆలోచనను రేకెత్తించిందే బీఆర్ఎస్, బీజేపీ అంటూ.. రివర్స్ అటాక్ మొదలుపెట్టారు కాంగ్రెస్ నేతలు. పూర్తిస్థాయి మెజారిటీ వచ్చినా సరే… పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరు, దానంతటదే కూలిపోతుందని మరికొందరు కామెంట్స్ చేశారు. దీంతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి… ఎన్నికల ఫలితాల తర్వాత ఫిరాయింపులు ఉండవని చెప్పిన మాటను పక్కనబెట్టి… ముప్పు తొలగించుకునే పని మొదలుపెట్టారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి ఈ ఫిరాయింపుల పర్వానికి తెరలేచింది. ఇప్పుడది క్రమంగా ఊపందుకుంటోంది. బీఆర్ఎస్కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలను ఈ విడత అసెంబ్లీ సమావేశాలకంటే ముందే…లాగేసుకోవాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. గతంలో తమ సీఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నట్టుగానే… ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని తాము కలిపేసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం అట.
Read Also: Anant Ambani Wedding: ధోని ఫొటోలు దిగుతుండగా వెయిట్ చేసిన అమితాబ్ బచ్చన్
అనుకున్నట్టుగా విలీనం జరగాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కానీ ఇప్పటివరకు 9 మంది ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరారు. మరో రెండు వారాల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. మరి ఆలోపే మిగతా ఎమ్మెల్యేల కండువాల మార్పిడి సాధ్యమా? అనుకున్నంత తేలిగ్గా అంత మంది చేరికలు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు పార్టీ వర్గాల్లో.. అయితే ఇప్పటికే పూర్తిస్థాయిలో పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యను సెట్ చేసి పెట్టుకున్నారన్న వాదన సైతం వినిపిస్తోంది. ఎమ్మెల్యేల చేరిక ఒకే అయితే… తర్వాత మండలి మీద కూడా దృష్టి పెట్టబోతున్నట్టు తెలిసింది. శాసనమండలిలో కాంగ్రెస్ కి పూర్తిస్థాయిలో బలం లేదు. వచ్చే సమావేశాల్లో మండలి చైర్మన్ పై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలనుకుంటోందట. దీంతో ఎమ్మెల్సీల చేరికను కూడా సీరియస్గానే తీసుకుని వర్కౌట్ చేయాలనుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు. ఇటు అసెంబ్లీ, అటు మండలిలో ఏకకాలంలో బీఆర్ఎస్ ఎల్పీలను విలీనం చేసుకోవాలన్న ఎత్తుగడను అమలు చేయాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రోజుకో ఎమ్మెల్యేని చేర్చుకుంటూ… మైండ్ గేమ్ మొదలుపెట్టింది కాంగ్రెస్. మరి అసెంబ్లీ సమావేశాల లోపు పని ముగించాలన్న ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
-
Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!