NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తెలుగువారి ఆత్మగౌరవం: సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు
- మైదుకూరులో నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు
- ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అంటే మూడు అక్షరాలు కాదని, తెలుగువారి ఆత్మగౌరవం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. రాజకీయాలను ఎన్టీఆర్ సమూలంగా మార్చారన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. గొప్ప కథానాయకుడిగా, గొప్ప నాయకుడుగా ఎదిగారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు కడప జిల్లా మైదుకూరులో సీఎం జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహంకి పూలమాల వేసి నివాళి అర్పించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మైదుకూరులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగువారి గుండెల్లో ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రయత్నించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మ గౌరవం. బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అంటే ధైర్యం. గతంలో తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనందరినీ మద్రాసి అని పిలిచేవారు. ఢిల్లీని గడగడలాడించి తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్’ అని అన్నారు.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Also Read: Top Headlines @1PM : టాప్ న్యూస్!
‘ఆరోజు ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయల కిలో బియ్యం.. ఈరోజు దేశవ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్టుగా అవతరించింది. చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక ఆదర్శం, ఒక స్ఫూర్తి. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి సినిమాలలో ఓ గొప్ప వ్యక్తి గా ఎదిగారు. గతంలో దోపిడీకి కేంద్రంగా ఉన్న రాజకీయాలను సమూలంగా మార్చి చూపించారు. బీసీలకు మొదటిసారిగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆడబిడ్డకు ఆస్తి హక్కు ఎన్టీఆర్ వల్లే సాధ్యం అయింది. మహిళ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.పేదరికం నిర్ములన ఎన్టీఆర్ కల.. ఇదే టీడీపీ పార్టీ ద్వేయం. రాయలసీమ కరువు సీమ కాదు.. రతనాల సీమ అని ఎన్టీఆర్ చేసి చూపించారు’ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!