NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ప్రారంభమైన రెండో రోజునే ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన పొందింది. ఈ ఐపీఓ ప్రారంభమైన రెండు రోజుల్లోనే 100 శాతానికి పైగా భర్తీ అయింది. ప్రస్తుతం ఈ ఐపీఓ మొత్తం 2.04 రెట్లు పైగా సబ్స్క్రైబ్ కాగా, రిటైల్ కోటా కూడా పూర్తిగా నిండిపోయింది. దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు గడువు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోంది.
ఈ ఐపీఓలో రిటైల్ కేటగిరీ 1.07 రెట్లు, క్యూఐబీ (QIB) కోటా 3.70 రెట్లు, ఎన్ఐఐ (NII) కోటా 2.07 రెట్ల చొప్పున సబ్స్క్రిప్షన్ సాధించాయి. సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు సెప్టెంబర్ 21 వరకు బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. కంపెనీ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 16నే ఈ ఇష్యూను తెరిచి, ఆ ద్వారా రూ. 6,746.18 కోట్లను సమీకరించింది.
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించడానికి (IPO) ముందు, ఆ షేర్లకు అనధికారికంగా జరిగే కొనుగోలు, అమ్మకాల మార్కెట్ను గ్రే మార్కెట్ అంటారు. ప్రస్తుతం దీనికి గ్రే మార్కెట్లో క్షీణత కనిపిస్తుంటంతో ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒక దశలో ఈ ఐపీఓ రూ. 310 వరకు పలికింది. అయితే ప్రైస్ బ్యాండ్ వెల్లడైన తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. నివేదికల ప్రకారం గురువారం రూ. 142 వద్ద ఉన్న గ్రే మార్కెట్ ప్రైస్, ప్రస్తుతం రూ. 105కి పడిపోయింది.
ఇక ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ను రూ. 1,700 నుంచి రూ. 1,785 మధ్య కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్లో 8 షేర్లు ఉండటంతో, ఇన్వెస్టర్లు కనీసం రూ. 14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రతి షేరుపై రూ. 170 రాయితీని ప్రకటించారు. ఈ ఐపీఓ మొత్తం పరిమాణం రూ. 22,561.57 కోట్లుగా ఉంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద వస్తుండగా.. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 12.64 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఈ ఇష్యూ సైజు రూ. 30,000 కోట్లుగా ఉండగా.. దానిని సవరించారు. సోమవారం వరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి తుది ఫలితాలపై మరింత స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..