NRI Smitha Reddy Joins In Bjp: బీజేపీలోకి ఎన్నారై స్మితారెడ్డి.. కండువా కప్పిన బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు అధికార బీఆర్ఎస్ లోకి వలసలు వస్తుంటే.. ఇటు బీజేపీలోకి కూడా వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీలో చేరారు ఎన్ఆర్ఐ స్మితారెడ్డి. కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ప్రవాస భారతీయురాలు, అరోహ్ లిమిటెడ్ ఐటీ, సూపర్ మార్కెట్ వ్యాపార నిర్వాహకురాలు బోదనపల్లి స్మితారెడ్డి బీజేపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన స్మితారెడ్డి ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్ లతో కలిసి కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి ప్రజాసంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్దకు వచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్మితారెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్మితారెడ్డి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు విధానాలకు ఆకర్షితురాలినై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని తెలిపారు.
Also Read
Read Also:Pawan Kalyan: ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న పవన్.. 20 ఏళ్ల తర్వాత ఇలా
మరోవైపు జగిత్యాలలో బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బిఆర్ యస్ పార్టీని చూసి జనం నవ్వుతున్నారు. గుజరాత్ గెలుపు దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. గుజరాత్ పోయి డబ్బులు ఇచ్చివచ్చిండు. బీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితి గా మారింది. కృష్టా జలాల విషయంలో తెలంగాణకి ద్రోహం చేసింది కేసీఆర్ అన్నారు. 299 టి ఎంసిలు కు సంతకం చేసి కమిషన్లు తీసుకున్నావ్. రెండు రాష్ట్ర నాయకులతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సెంటి మెంట్ రగిల్చి పబ్బం గడుపుతున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..