Himanta Biswa Sarma: “మియా ముస్లింల” ఓట్లు మాకు అవసరం లేదు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను ‘‘మియా ముస్లింల’’ ఓట్లను ఆశించడం లేదని శనివారం అన్నారు. గౌహతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మియా ముస్లింలు ఎక్కువగా ఉన్నందున తాను మెడికల్ కాలేజీలను సందర్శించడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మియా అనేది బెంగాలీ మాట్లాడే, బెంగాల్ నుంచి అస్సాం వచ్చిన ముస్లింలకు ఉపయోగించే ఓ పదం. రాష్ట్రంలోని స్థానిక ముస్లింల అభివృద్ధిపై తాను, తమ పార్టీ బీజేపీ దృష్టి సారించిందని హిమంత అన్నారు. ‘‘ మేము అస్సాంలోని స్థానిక ముస్లింఅ అభివృద్ధిపై దృష్టి సారించాము. అస్సాంలోని స్థానిక ముస్లింలు తప్ప, నేను వేరే ముస్లింల ఓట్లను ఎప్పుడూ ఆశించను. ప్రతీ మెడికల్ కాలేజీలో మా స్థానిక యువత కన్నా మియా ముస్లింలు ఎక్కువగా ఉండటం బాధాకరం. వారు ఎక్కువగా ఉండే మెడికల్ కాలేజీలకు వెళ్లడం మానేశాను’’ అని హిమంత అన్నారు.
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
Read Also: World Cup: 2003-2019 వరల్డ్ కప్.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ వివరాలు ఇవే..!
అస్సాంలోని ముస్లిం కమ్యూనిటీతో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ పార్టీలకు ఓట్లతో సంబంధం ఉందని, భయానక వాతావరణం సృష్టించడం ద్వారా వారి నుంచి ఓట్లు అడుగుతున్నారని సీఎం విమర్శించారు. వలస ముస్లింలతో రెండు పార్టీలకు సంబంధాలు ఉన్నాయి, కానీ వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వారికోసం రోడ్లు, వంతెనలు, పాఠశాలలు నిర్మించలేదని ఆరోపించారు. మొదటిదశగా స్థానిక అస్సామీ ముస్లింల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని, వారిపై తర్వలోనే సర్వే నిర్వహిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. అస్సాంకు చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్, ధుబ్రీ ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడుతూ.. మియా ముస్లింలు పనిచేయకుంటే గౌహతి ఎడారిగా మారుతుందని, గౌహతిలో మియా ముస్లింలు మూడు రోజులు పనిచేయకుంటే శ్మశాన వాటికలా తయారవుతుందని అన్నారు.
తాజావార్తలు
-
US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
-
Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!