Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్టు..
- సంచలన తీర్పు ఇచ్చిన కేరళ హైకోర్టు..
- తండ్రి స్వార్జిత ఆస్తిపై వారసత్వ హక్కు ఉండదు..
- తండ్రి ఇష్టానుసారం ఎవరికైనా ఇచ్చే అధికారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ వారసత్వ చట్టం, ఆస్తి హక్కుల విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి సంపాదించిన ప్రతీ పైసా, ప్రతీ గజం స్థలం ఆటోమేటిక్ గా కొడుకుకు దక్కుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ.. చట్టం దృష్టిలో ‘వారసత్వ ఆస్తి’కి, ‘స్వార్జిత ఆస్తి’కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇదే అంశంపై కేరళ హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పును వెలువరించింది. తండ్రి కష్టార్జితంపై కొడుకుకు ఉండే హక్కుల విషయంలో న్యాయస్థానం కీలక స్పష్టత ఇచ్చింది.
కేరళ హైకోర్టు ధర్మాసనం తన తీర్పులో అత్యంత ముఖ్యమైన విషయాన్ని చెప్పింది. తండ్రి తనంతట తానుగా.. సొంత కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపై కొడుకుకు ఎటువంటి సహజసిద్ధమైన లేదా జన్మహక్కు ఉండదు. ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అమ్మాలి లేదా ఎవరికి బహుమతిగా ఇవ్వాలి అనే పూర్తి అధికారం ఆ తండ్రికి మాత్రమే ఉంటుంది. తన ఆస్తిని కొడుకుకు ఇవ్వకుండా నిరాకరించే హక్కు కూడా తండ్రికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
Also Read
- డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
- Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
తాత ముత్తాతల నుంచి వారసత్వంగా తండ్రికి వచ్చిన ఆస్తిపై కొడుకులకు హక్కు ఉంటుంది. దీనిని వారు జన్మహక్కుగా క్లెయిమ్ చేయవచ్చు. స్వార్జిత ఆస్తి అంటే.. తండ్రి తన ఉద్యోగం, వ్యాపారం లేదా సొంత వనరులతో కొనుగోలు చేసిన ఆస్తి. దీనిపై తండ్రి బ్రతికి ఉన్నంత కాలం పిల్లలకు ఎటువంటి హక్కు ఉండదు. తండ్రి తన ఇష్టప్రకారం దీనిని ఎవరికైనా రాసివ్వవచ్చు.
Also Read:Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..
కేరళలో ఒక వ్యక్తి తన తండ్రికి చెందిన 46 సెంట్ల భూమి విషయంలో కోర్టును ఆశ్రయించాడు. ఆ ఆస్తి తన తండ్రిది కాబట్టి అది తనకే చెందాలని, కానీ తన తల్లి ఆ ఆస్తిని మరో ఐదుగురు కుటుంబ సభ్యులకు పంచేలా వీలునామా రాసిందని అతను వాదించాడు. అయితే.. విచారణలో ఆ 46 సెంట్ల భూమి తండ్రికి వారసత్వంగా రాలేదని, ఆయన స్వయంగా సంపాదించిన ఆస్తి అని తేలింది.
దీంతో.. ఆ ఆస్తిపై కొడుకుకు ప్రత్యేక హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. తండ్రి తన స్వార్జిత ఆస్తిని తన భార్యకు (తల్లికి) బహుమతిగా ఇవ్వడం లేదా ఆమె ద్వారా ఇతరులకు వీలునామా రాయించడం చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఆస్తి పంపకాల విషయంలో తండ్రి నిర్ణయమే అంతిమమని మరోసారి రుజువైంది.
తాజావార్తలు
-
Pradeep Ranganathan: హీరో నుంచి నిర్మాతగా మరో అడుగు.. కొత్త సినిమాతో ప్రదీప్ రంగనాథన్ సర్ప్రైజ్!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Anjana Singh: కాస్టింగ్ కౌచ్ మారిపోయింది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది ఇదే!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
OPEC+ Oil Production: వాహనదారులకు పండగే.. OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్?
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!