Non Veg Markets Full Busy: కనుమ ఎఫెక్ట్.. రద్దీగా మారిన నాన్ వెజ్ మార్కెట్లు..
- సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతోన్న ప్రజలు..
- కనుమ పండుగ సందర్భంగా నాన్వెజ్ మార్కెట్లలో రద్దీ..
- చికెన్, మటన్, చేపలు ఇలా నాన్వెజ్ కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు..
- కనుమ రోజు అతిధులకు ప్రత్యేక విందు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Non Veg Markets Full Busy: సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నాయి పల్లెలు.. ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్వెజ్ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.. కనుమ రోజు అతిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు గోదావరి జిల్లా వాసులు. . దీంతో.. నాన్వెజ్ అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాన్ వెజ్ మార్కెట్లలో రద్దీ వాతావరణం నెలకొంది. భోగి, సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్న జిల్లా వాసులు కనుమ రోజు నాన్వెజ్ వంటకాలతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో చికెన్, మటన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువైంది. ఫిష్ మార్కెట్లు బిజీగా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నుంచో తరలివచ్చిన అతిధుల కోసం ప్రత్యేక వంటకాలు చేసే పనిలో జిల్లా వాసులు నిమగ్నమయ్యారు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది..
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
ఇక, విజయవాడ నగరంలో చికెన్, మటన్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. కనుమ పండుగ కావటంతో తెల్లవారు జాము నుంచే మటన్ కొనుగోలుకు నాన్ వెజ్ ప్రియులు మార్కెట్లకు క్యూ కడుతున్నారు.. మటన్ తో పాటు నాటు కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.. మటన్ తో సమానంగా నాటు కోళ్లు రేటు పలుకుతున్నాయి. పండుగ సందర్భంగా డిమాండ్ కు తగినట్లుగా మాంసం సరఫరాకు వ్యాపారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. కనుమ పండుగను నెల్లూరు జిల్లాలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పండుగ మొదటి రెండు రోజులూ.. పిండి. వంటలకు ప్రాధాన్యమిచ్చే ప్రజలు మూడో రోజున మాంసాహార వంటకాలను వండుకుంటారు.. దీంతో తెల్లవారుజామున నుంచి నెల్లూరులోని చికెన్.. మటన్ స్టాళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా నెల్లూరు మార్కెట్ నుంచి చికెన్.. మటన్, రొయ్యలు, చేపలను తీసుకువెళుతున్నారు. ఫారం కోళ్లతో పోలిస్తే నాటు కోళ్లకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాపై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్
మరోవైపు, కోడిపందాల్లో ఓడిన కోడి పుంజులకు కూడా భారీ డిమాండ్ నెలకొంది.. ఓడిపోయిన కోళ్లను కోడిపందాల బరుల దగ్గరే కొనేందుకు పోటీ పడుతున్నారు.. పందెం కోళ్లకు ప్రత్యేకమైన ఆహారం ఇచ్చి పెంచుతారు కాబట్టి.. అవి సాధారణ కోళ్లు, నాటు కోళ్ల కంటే.. మరింత రుచిగా ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు.. పందెం కోళ్ల రుచి చూడని జన్మ ఎందుకు అంటున్నారు గోదావరి జిల్లాల వాసులు.. మొత్తంగా కనుక వేళ నాన్వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి..
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!