Sasikala: కోర్టుకు గైర్హాజరుపై శశికళపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ “విఐపి ట్రీట్మెంట్” ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. మరో నిందితురాలు శశికళ కోడలు ఇళవరసికి కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు.. సోమవారం విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది.
Read Also: Xi Jinping: ఈ 5 కారణాల వల్లే జిన్పింగ్ ఇండియాకు రావడం లేదా..?
Also Read
జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన నేపథ్యంలో.. జైలులో ఉన్నప్పుడు విలాసవంతమైన సౌకర్యాల పొందడం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే పలు విచారణల తర్వాత ఈ ఏడాది మేలో.. కర్ణాటక హైకోర్టు శశికళతో పాటు నిందితులుగా ఉన్న ముగ్గురిని నిర్ధోషులుగా ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు మిగిలిన ముగ్గురు (శశికళ, ఇళవరసి, సుధాకరన్) పరప్పన అగ్రహారం జైలులో ఉన్నారు.
Read Also: OG : రికార్డు స్థాయిలో ఓజి ఓవర్సిస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..?
అయితే జైలు నిబంధనలను ఉల్లంఘించి శశికళ, ఇళవరసి ఇద్దరూ విలాసవంతమైన సౌకర్యాలు కల్పించి జైలు నుంచి బయటకు వస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో జైలు అధికారులకు లగ్జరీ సౌకర్యాలు కల్పించడం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 2017 ఫిబ్రవరి 15న శశికళ జైలుకెళ్లినప్పటి నుంచి ఆమెకు సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ముగ్గురిపై ఉన్నాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ శశికళ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకాయుక్త కోర్టులో ఆమెపై విచారణపై స్టే విధించాలని హైకోర్టు ఆదేశించలేదు. ఇదిలావుండగా.. సోమవారం జరగాల్సిన విచారణకు శశికళ ప్రత్యేక కోర్టుకు హాజరుకాలేదు. అయితే ఆమె పదేపదే గైర్హాజరీని పరిగణనలోకి తీసుకుని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!