Sasikala: కోర్టుకు గైర్హాజరుపై శశికళపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ “విఐపి ట్రీట్మెంట్” ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. మరో నిందితురాలు శశికళ కోడలు ఇళవరసికి కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు.. సోమవారం విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది.
Read Also: Xi Jinping: ఈ 5 కారణాల వల్లే జిన్పింగ్ ఇండియాకు రావడం లేదా..?
Also Read
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన నేపథ్యంలో.. జైలులో ఉన్నప్పుడు విలాసవంతమైన సౌకర్యాల పొందడం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే పలు విచారణల తర్వాత ఈ ఏడాది మేలో.. కర్ణాటక హైకోర్టు శశికళతో పాటు నిందితులుగా ఉన్న ముగ్గురిని నిర్ధోషులుగా ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు మిగిలిన ముగ్గురు (శశికళ, ఇళవరసి, సుధాకరన్) పరప్పన అగ్రహారం జైలులో ఉన్నారు.
Read Also: OG : రికార్డు స్థాయిలో ఓజి ఓవర్సిస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..?
అయితే జైలు నిబంధనలను ఉల్లంఘించి శశికళ, ఇళవరసి ఇద్దరూ విలాసవంతమైన సౌకర్యాలు కల్పించి జైలు నుంచి బయటకు వస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో జైలు అధికారులకు లగ్జరీ సౌకర్యాలు కల్పించడం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 2017 ఫిబ్రవరి 15న శశికళ జైలుకెళ్లినప్పటి నుంచి ఆమెకు సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ముగ్గురిపై ఉన్నాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ శశికళ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకాయుక్త కోర్టులో ఆమెపై విచారణపై స్టే విధించాలని హైకోర్టు ఆదేశించలేదు. ఇదిలావుండగా.. సోమవారం జరగాల్సిన విచారణకు శశికళ ప్రత్యేక కోర్టుకు హాజరుకాలేదు. అయితే ఆమె పదేపదే గైర్హాజరీని పరిగణనలోకి తీసుకుని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..