Sasikala: కోర్టుకు గైర్హాజరుపై శశికళపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వికె శశికళ “విఐపి ట్రీట్మెంట్” ఇచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరుకాకపోవడంతో లోకాయుక్త ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. మరో నిందితురాలు శశికళ కోడలు ఇళవరసికి కూడా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరితో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు.. సోమవారం విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది.
Read Also: Xi Jinping: ఈ 5 కారణాల వల్లే జిన్పింగ్ ఇండియాకు రావడం లేదా..?
Also Read
- JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
- YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
- Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిన నేపథ్యంలో.. జైలులో ఉన్నప్పుడు విలాసవంతమైన సౌకర్యాల పొందడం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే పలు విచారణల తర్వాత ఈ ఏడాది మేలో.. కర్ణాటక హైకోర్టు శశికళతో పాటు నిందితులుగా ఉన్న ముగ్గురిని నిర్ధోషులుగా ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది. కర్ణాటక ప్రత్యేక కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు మిగిలిన ముగ్గురు (శశికళ, ఇళవరసి, సుధాకరన్) పరప్పన అగ్రహారం జైలులో ఉన్నారు.
Read Also: OG : రికార్డు స్థాయిలో ఓజి ఓవర్సిస్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ సంస్థ..?
అయితే జైలు నిబంధనలను ఉల్లంఘించి శశికళ, ఇళవరసి ఇద్దరూ విలాసవంతమైన సౌకర్యాలు కల్పించి జైలు నుంచి బయటకు వస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో జైలు అధికారులకు లగ్జరీ సౌకర్యాలు కల్పించడం కోసం రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 2017 ఫిబ్రవరి 15న శశికళ జైలుకెళ్లినప్పటి నుంచి ఆమెకు సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ముగ్గురిపై ఉన్నాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ శశికళ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే లోకాయుక్త కోర్టులో ఆమెపై విచారణపై స్టే విధించాలని హైకోర్టు ఆదేశించలేదు. ఇదిలావుండగా.. సోమవారం జరగాల్సిన విచారణకు శశికళ ప్రత్యేక కోర్టుకు హాజరుకాలేదు. అయితే ఆమె పదేపదే గైర్హాజరీని పరిగణనలోకి తీసుకుని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
Peddi : ఫలించిన వ్యూహం.. మూడో వారంలోనూ ‘పెద్ది’ అరాచకం!
-
Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!