Adani: అదానీ గ్రూపులో చేరిన ఆ మీడియా సంస్థ.. పూర్తిగా కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బిలినీయర్, దేశంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానిపై ప్రముఖ అమెరికన్ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై విచారణకు కొన్ని కమిటీలు కూడా వేశారు. సెబీ వీటిపై పూర్తి ఆధారాలతో నివేదికలు సమర్పించనుంది. ఆగస్టు 15 నాటికే వీటికి సంబంధించి పూర్తి నివేదికను సెబీ సుప్రీంకోర్టుకు అందిచాల్సి ఉండగా ఇంకా కొన్ని విషయాలను పరిశీలించడానికి మరికొంత సమయం కావాలని సెబీ కోరింది. దీనికి సుప్రీం అనుమతినివ్వడంతో ఈ నెల చివరిలో సెబీ ఆ వివరాలను సుప్రీంకు అందించనుంది.
ఇదిలా వుండగా అప్పటి నుంచి అదానీ గ్రూప్ తన వ్యాపార విస్తరణ విషయంలో ఆచీతూచీ వ్యవహరిస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటూ, మరికొన్ని కొత్త వ్యాపారాలను టేకోవర్ చేస్తూ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆరోపణల కారణంగా కొంత నష్టపోయిన సంస్థ తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా వుండగా క్వింటిలియన్ బిజినెస్ మీడియా(BQ ప్రైమ్)లో గతేడాది మార్చిలో 49 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు మిగిలిన 51 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. గతేడాది మార్చిలో ఇందులో 49 శాతం వాటాను రూ. 47.84 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న అదానీ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు మిగిలిన మొత్తాన్ని కైవసం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 14న జరిగిన వార్షిక సమావేశంలో అదానీ కంపెనీ బోర్డు డైరెక్టర్లు, క్వింటిలియన్ మీడియా లిమిటెడ్ మధ్య బైండింగ్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగినట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది.
Also Read
- Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
- Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ "హోమ్ రెమిడీ".. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
Also Read: Canara Bank : శుభవార్త చెప్పిన ప్రభుత్వ బ్యాంక్… ఇక మీ డబ్బు డబుల్ అవుతుంది
BQ ప్రైమ్ ను ఒకప్పుడు బ్లూమ్ బెర్గ్ క్వింట్ అని పిలిచేవారు. ఇది US-ఆధారిత ఆర్థిక వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ మీడియా, రాఘవ్ బాహ్ల్ క్వింటిలియన్ మీడియాతో జాయింట్ వెంచర్ లా ఉండేది. అయితే గతేడాది మార్చిలో ఈ ఒప్పందం నుంచి బ్లూమ్బెర్గ్ వైదొలగింది. ఇక BQ ప్రైమ్ తో పాటు డిసెంబర్ 2022లో NDTVలో దాదాపు 65 శాతం వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. అయితే అదానీ గ్రూప్ మొదట కొనుగోలు చేసిన మీడియా సంస్థగా BQ ప్రైమ్ ను పేర్కొనొచ్చు.
తాజావార్తలు
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!