Vijayawada: చలో విజయవాడకు సీపీఎస్ ఉద్యోగుల పిలుపు.. అమల్లో 144 సెక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: సీపీఎస్ ఉద్యోగులు ఇవాళ, రేపు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.. సీపీఎస్ వల్ల తమకు అన్యాయం జరిగిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మొరపెట్టుకున్నని అంటున్నారు సీపీఎస్ ఉద్యోగులు.. జీపీఎస్ వల్ల తమ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా మారుతున్నాయి.. కానీ, అత్యవసర పరిస్ధితుల్లో వారి డబ్బులు వారే వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా మారిపోవడం, సంవత్సరాల తరబడి దాచుకున్న డబ్బు మొత్తం కాకుండా అందులో కొంత భాగమే రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఇవ్వడాన్ని సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
Read Also: Kandula Durgesh: భయంతోనే పవన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు..!
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ఇదిలా ఉంటే తాము దాచుకున్న డబ్బులోంచి ఆపిన డబ్బుకే వడ్డీ లెక్కేసి పెన్షన్ గా ఇవ్వడం ద్వారా అన్యాయం జరిగిందనేది సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన ఆరోపణగా ఉంది. అయితే, సీపీఎస్ ఉద్యోగులు ఇవాళ, రేపు తలపెట్టిన ఛలో విజయవాడకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఛలో విజయవాడ నిర్వహణకు సిద్ధమైతే చట్టపర చర్యలుంటాయని హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని కమిషనర్ కార్యాలయం ప్రకటించింది.. మరోవైపు, ఛలో వరకు విజయవాడ నిర్వహించాలని చూసిన సీపీఎస్ నాయకులు పలువురిని ఇప్పటికే అరెస్టులు చేసారు పోలీసులు.. ఎవరూ ఆందోళనకు పాల్గొన్నా అరెస్ట్లు తప్పవని స్పష్టం చేస్తున్నారు పోలీసులు. అయితే, ఏపీ సీపీఎస్ ఉద్యోగులు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. . అందులో భాగంగా విజయవాడ ధర్నాచౌక్ లో ఛలో విజయవాడ నిర్వహణకు అనుమతులు కోరగా పోలీసులు నిరాకరించారు.. పలువురు సీపీఎస్ నాయకులను అరెస్టులు చేసారు.. సీపీఎస్ వద్దు ఓపీఎస్ కావాలి అనేది మాత్రమే తమ డిమాండ్ అని అంటున్నారు సీపీఎస్ సంఘ జాయింట్ సెక్రెటరీ సి.మరియదాసు.. జీపీఎస్ కు ఎలాంటి మద్దతు తెలపలేదని, ఆ అంశంపై చర్చలే జరగలేదని.. ఏ నలుగురూ అయితే జీపీఎస్ కు సరే అన్నారో వారికి అమలు చేయమని అంటున్నారు.
తాజావార్తలు
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!