Kandula Durgesh: భయంతోనే పవన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandula Durgesh: ఓటమి భయంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.. ఇటీవల పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడుతూ వస్తున్న జనసేన.. చివరకు పవన్ కల్యాణ్ పర్యటనను కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది.. ఇక, ఈ పరిస్థితులపై దుర్గేష్ మాట్లాడుతూ.. పవన్ అంటే వైసీపీకి భయం పట్టుకుంది.. అందుకే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు.
Read Also: CM Revanth Reddy: కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన కందుల దుర్గేష్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్ బీ అధికారులు అనుమతులు తీసుకోవాలని పవన్ కల్యాణ్ పర్యటనకు అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాల వల్ల పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా పడిందన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగించేలా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. పనికిరాని సాంకేతిక కారణాల లోపాలు చూపుతూ అనుమతులు నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పర్యటనను రద్దు చేసేందుకు సహకరిస్తున్న అధికారులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు కందులు దుర్గేష్.
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!