Hardeep Singh Puri: “ఇది బాధ్యతారాహిత్యం”.. భారత్లో లాక్డౌన్ పుకార్లపై కేంద్ర మంత్రి క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో వివరించారు. కరోనా సంక్షోభం నాటి పరిస్థితులకు ప్రజలకు సిద్ధంగా ఉండాలని మోడీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. ప్రధాని వ్యాఖ్యల అనంతరం లాడ్ డౌన్ వంటి పరిస్థితులు వస్తాయనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 తరహా దేశవ్యాప్త లాక్డౌన్ విధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఆ వదంతులు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పుకార్లను వ్యాపింపజేయడం, భయాందోళనలను సృష్టించడం బాధ్యతారాహిత్యమన్నారు.
READ MORE: Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్మ్యాన్ను చూసి అందరూ షాక్
Also Read
“భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రపంచ పరిస్థితులు ఎప్పటి కప్పుడు మార్పునకు లోనవుతున్నాయి. ఇంధనం, సరఫరా గొలుసులు (supply chains), నిత్యావసర వస్తువులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మన పౌరులకు ఇంధనం, శక్తి, ఇతర కీలక వస్తువుల సరఫరా నిరంతరాయంగా అందేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారతదేశం నిలకడను (resilience) చాటుకుంటూ వస్తోంది. మేము సమయానుకూలంగా, ముందస్తుగా, సమన్వయంతో కూడిన చర్యలను కొనసాగిస్తాం. భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు పూర్తిగా అబద్ధం. నేను దీనిని స్పష్టంగా చెపుతున్నాను, భారత ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. ఇలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పుకార్లను వ్యాపింపజేయడం, భయాందోళనలను సృష్టించడం బాధ్యతారాహిత్యం, హానికరం.” అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పేర్కొన్నారు.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!