Hardeep Singh Puri: “ఇది బాధ్యతారాహిత్యం”.. భారత్లో లాక్డౌన్ పుకార్లపై కేంద్ర మంత్రి క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: మధ్యప్రాచ్య సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో జనాలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో వివరించారు. కరోనా సంక్షోభం నాటి పరిస్థితులకు ప్రజలకు సిద్ధంగా ఉండాలని మోడీ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ప్రజల్లో మరోసారి కలవరం మొదలైంది. ప్రధాని వ్యాఖ్యల అనంతరం లాడ్ డౌన్ వంటి పరిస్థితులు వస్తాయనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తాజాగా పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 తరహా దేశవ్యాప్త లాక్డౌన్ విధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, ఆ వదంతులు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. పుకార్లను వ్యాపింపజేయడం, భయాందోళనలను సృష్టించడం బాధ్యతారాహిత్యమన్నారు.
READ MORE: Rohit Sharma: “ఓరి దేవుడా.. రోహిత్, గుర్తుపట్టలేకపోయాను”.. హిట్మ్యాన్ను చూసి అందరూ షాక్
Also Read
- చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
- Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
- Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
- Akkineni Akhil: మీ ఇంట్లో ఒకడిని అవ్వాలనే ఈ ప్రయత్నం.!
“భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారన్న వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రపంచ పరిస్థితులు ఎప్పటి కప్పుడు మార్పునకు లోనవుతున్నాయి. ఇంధనం, సరఫరా గొలుసులు (supply chains), నిత్యావసర వస్తువులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను మేము నిశితంగా గమనిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మన పౌరులకు ఇంధనం, శక్తి, ఇతర కీలక వస్తువుల సరఫరా నిరంతరాయంగా అందేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారతదేశం నిలకడను (resilience) చాటుకుంటూ వస్తోంది. మేము సమయానుకూలంగా, ముందస్తుగా, సమన్వయంతో కూడిన చర్యలను కొనసాగిస్తాం. భారతదేశంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు పూర్తిగా అబద్ధం. నేను దీనిని స్పష్టంగా చెపుతున్నాను, భారత ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు. ఇలాంటి సమయాల్లో మనం ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐక్యంగా ఉండటం ముఖ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పుకార్లను వ్యాపింపజేయడం, భయాందోళనలను సృష్టించడం బాధ్యతారాహిత్యం, హానికరం.” అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పేర్కొన్నారు.
The global situation remains in flux, and we are closely monitoring developments across energy, supply chains, and essential commodities on a real-time basis.
Under the leadership of Hon’ble PM @narendramodi Ji, all necessary steps are being taken to ensure uninterrupted…
— Hardeep Singh Puri (@HardeepSPuri) March 27, 2026
తాజావార్తలు
-
చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!
-
NBK112: కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా.. బాలయ్య కోసం 20 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్!
-
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టు విచారణ.!
-
Sanju Samson-Gambhir: సంజు అసంతృప్తి.. గంభీర్ సర్దిచెప్పే ప్రయత్నం.. సోషల్ మీడియాలో రచ్చ!
-
Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
ట్రెండింగ్
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!