petrol pump: పెట్రోల్ కావాలంటే.. పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
petrol pump: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకుల్లో వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందని చూపిస్తేనే పెట్రోల్ పోయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అక్టోబర్ 25నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా ఢిల్లీలోని ఏ పెట్రోల్ బంకులు వాహనాలకు ఇంధనం నింపరాదంటూ ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ 29న పర్యావరణ, రవాణా, ట్రాఫిక్ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధానంపై ఈ ఏడాది మార్చిలో ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నామని, మెజారిటీ దీని అమలుకు ఓకే చెప్పడంతోనే ఈ విధానం తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు.
Read also: Indonesia: ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127మంది మృతి
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల కాలంలో చాలా ఎక్కువైంది. మనుషుల ఆరోగ్యంపై దాని ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఇంధన వినియోగం కూడా రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వాయు కాలుష్యం ఎక్కువుతోంది. దీంతో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. గతంలోనూ ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని తీసుకొచ్చింది. తాజాగా ‘నో పీయూసీ – నో ఫ్యూయల్’ని అమలు చేయనుంది. ఇకపై వాహనాలకు పొల్యుషన్ సర్టిఫికేట్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ పోయడానికి అనుమతి ఇవ్వడం కుదరదని తెలిపింది.
Read also:tag mahal : తాజ్ మహల్ పై వివాదం.. సుప్రీంకోర్టులో పిటీషన్
కాలుష్యాన్ని నియంత్రించేందుకు సవరించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) ప్రభావవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 3 న తన 24X7 వార్ రూమ్ను ప్రారంభించనున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణ జీఆర్ఏపీ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెన్స్(AQI) 200-300మధ్య ఉంటేనే అనుమతి ఇస్తామని రాయ్ మీడియాకు తెలిపారు. అలాగే AQI 300-400మధ్య ఉంటే డీజిల్ సెట్లపై నిషేదం ఉంటుందన్నారు. AQI 400-500 మధ్య నుంచి దాటితే వాహనాలపై కఠిన చర్యలుతీసుకుంటామని మంత్రి ప్రకటించారు. అక్టోబర్ 6నుంచి ఢిల్లీలో దుమ్ము వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దుమ్ము కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
- Tags
- Bid
- Certificate
- Delhi
- Fuel
- New Delhi
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!