petrol pump: పెట్రోల్ కావాలంటే.. పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాల్సిందే
petrol pump: పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెట్రోల్ బంకుల్లో వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందని చూపిస్తేనే పెట్రోల్ పోయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అక్టోబర్ 25నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా ఢిల్లీలోని ఏ పెట్రోల్ బంకులు వాహనాలకు ఇంధనం నింపరాదంటూ ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సెప్టెంబర్ 29న పర్యావరణ, రవాణా, ట్రాఫిక్ శాఖల అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధానంపై ఈ ఏడాది మార్చిలో ప్రజల నుంచి అభిప్రాయం తీసుకున్నామని, మెజారిటీ దీని అమలుకు ఓకే చెప్పడంతోనే ఈ విధానం తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు.
Read also: Indonesia: ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127మంది మృతి
Also Read
- Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
- Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
- Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల కాలంలో చాలా ఎక్కువైంది. మనుషుల ఆరోగ్యంపై దాని ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఇంధన వినియోగం కూడా రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వాయు కాలుష్యం ఎక్కువుతోంది. దీంతో కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. గతంలోనూ ఢిల్లీ ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని తీసుకొచ్చింది. తాజాగా ‘నో పీయూసీ – నో ఫ్యూయల్’ని అమలు చేయనుంది. ఇకపై వాహనాలకు పొల్యుషన్ సర్టిఫికేట్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో ఫ్యూయల్ పోయడానికి అనుమతి ఇవ్వడం కుదరదని తెలిపింది.
Read also:tag mahal : తాజ్ మహల్ పై వివాదం.. సుప్రీంకోర్టులో పిటీషన్
కాలుష్యాన్ని నియంత్రించేందుకు సవరించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) ప్రభావవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 3 న తన 24X7 వార్ రూమ్ను ప్రారంభించనున్నట్లు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. నిర్మాణాలు, వ్యర్థాల నిర్వహణ జీఆర్ఏపీ ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెన్స్(AQI) 200-300మధ్య ఉంటేనే అనుమతి ఇస్తామని రాయ్ మీడియాకు తెలిపారు. అలాగే AQI 300-400మధ్య ఉంటే డీజిల్ సెట్లపై నిషేదం ఉంటుందన్నారు. AQI 400-500 మధ్య నుంచి దాటితే వాహనాలపై కఠిన చర్యలుతీసుకుంటామని మంత్రి ప్రకటించారు. అక్టోబర్ 6నుంచి ఢిల్లీలో దుమ్ము వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. నిర్మాణ స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి దుమ్ము కాలుష్యాన్ని అరికట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
- Tags
- Bid
- Certificate
- Delhi
- Fuel
- New Delhi
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
-
Malkajgiri: డేటింగ్ యాప్లతో జాగ్రత్త!! న్యూడ్ వీడియో కాల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ముంచిన యువతి
-
Nagarjuna-Lenin : ‘లెనిన్’ పై నాగార్జున సాలిడ్ రివ్యూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసిన కింగ్
-
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజలను పారేస్తున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు.. ఇంట్లోనే ఖరీదైన మగజ్ సింపుల్గా..
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో