Indonesia: ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట.. 127మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia: ఇండోనేషియాలో ఫుట్ బాల్ మ్యాచ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో జరిగిన తొక్కిసలాట కారణంగా 127మంది మరణించారు. మరో 180మంది గాయపడ్డారు. ఈ ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్ లో జరిగింది. సరదాను పంచాల్సిన మ్యాచ్లో బీభత్సం, హింసా కాండ నడిచింది. ఇండోనేసియాలోని టాప్ లీగ్గా గుర్తింపు పొందిన బ్రి లిగా 1లో భాగంగా శనివారం రాత్రి మలాంగ్ స్టేడియంలో స్థానిక అరేమా ఎఫ్సీ, పెర్సేబయా సురబయా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పెర్సేబయా జట్టు 3-2 తేడాతో విజయం సాధించింది.
స్థానిక జట్టు అయిన అరేమా ఎఫ్సీ అభిమానులు.. తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. పిచ్ మధ్యలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జి.. టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
Read also: up accident: చెరువులో పడ్డ ట్రాక్టర్.. 26మంది మృతి
మలాంగ్లోని స్టేడియానికి హాజరైన ప్రేక్షకులు.. పిచ్ మధ్యలోకి పరిగెత్తుతున్న దృశ్యాలను స్థానిక మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో బ్రి లిగా 1 (BRI Liga 1) లీగ్ను వారంపాటు వాయిదా వేశారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించినట్లు ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేసియా ప్రకటించింది.
Read also:Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఎదురుదెబ్బ.. ఇమ్రాన్ ఖాన్కు అరెస్ట్ వారెంట్
తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI లిగా 1 ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్లోని ఇండోనేషియా పోలీసు చీఫ్ నికో అఫింటా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. అరేమా ఎఫ్సి – పెర్సెబయా సురబయా మధ్య జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా దాడికి దిగారని తెలిపారు. దీంతో అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని, ఇది కాస్త తొక్కిసలాటకు దారితీసిందన్నారు. ఈ హింసాకాండలో చాలామందికి ఊపిరాడకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
OTR: హాట్ కామెంట్స్ నుంచి సైలెంట్ మోడ్కు పోచారం
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!