Nizamabad Crimes: వారంలో 8 రేప్ కేసులు..ఏం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభం శుభం తెలియని మైనర్ బాలికలు అన్యాయానికి గురవుతున్నారు. తెలిసి తెలియని వయస్సులో కొందరు తప్పుచేస్తే.. మరికొందరు మోసపూరిత మాటలకు బలైపోతున్నారు.. ఆర్దిక ఇబ్బందులు, సమాజం పట్ల అవగాహనా రాహిత్యం, ఆధునిక ప్రపంచం పట్ల మక్కువ, అరచేతిలో ఇంటర్ నెట్ బాలికలను చిన్న వయస్సులోనే మోసపోయేలా.. మరికొందరు తప్పుదారి పట్టేలా చేస్తుంది. మోసమైనా, మోజైనా అంతిమంగా బాలికలే నష్టపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న మైనర్ బాలికల అత్యాచార ఘటనలు సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ఎనిమిదిమంది మైనర్ బాలికలపై అత్యాచారాల ఘటనలు వెలుగు చూసాయి. చేదు నిజాలు ఆలస్యంగా బయటకు వస్తున్నాయి. ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారం రోజుల్లో ఎనిమిది మందికి పైగా మైనర్ బాలికలపై అత్యాచారం జరిగినట్లు సమాచారం. నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో చోటుచేసుకున్న ఘటనతో విచారణ చేపట్టిన మహిళా కమీషన్ కు అప్పటి వరకు వెలుగు చూడని విషయాలు బయట పడ్డాయి. విస్తుపోయే సంఘటనలు, విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్లారెడ్డి, ఇందల్వాయి, ధర్పల్లి, యడపల్లి, భోదన్, గాజులపేట, ధర్మపురి హిల్స్ ప్రాంతాల్లో వారం రోజుల వ్యవధిలో ఈ ఘటనలు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుది. వెలుగు చూసిన ఈఘటనల్లో 8 మంది గర్భం దాల్చినట్లు డాక్టర్లు నిర్దారించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కొన్ని ఘటనలు మైనర్ లకు తెలిసి జరగగా మరికొన్ని ఘటనలు మైనర్ ల ప్రమేయం లేకుండానే జరిగినట్లు విచారణలో తేలింది.
Also Read
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- Healthy Breakfast Recipe: రోజంతా ఎనర్జీగా ఉండాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్..! ప్రోటీన్ అధికంగా ఉండే శనగ చాట్ ఇలా ట్రై చేయండి..
ఇటువంటి ఘటనల చాలా వెలుగులోకి రావడంలేదని అంటున్నారు మహిళా సంఘాలు.. చాలా మందికి తెలిసే అన్యాయం జరిగితే…. మరికొందరికి ఏం తెలియకుండా మోసపోతున్నారని అంటున్నారు. మైనర్ గా ఏం తెలియని వయస్సులో మోసపోవడం చాలా సీరియస్ గా తీసుకోవాలని ఆవయస్సులో మోసపోవడం విచారకరం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మైనర్ లను మభ్యపెట్టి, మాయమాటలు చెప్పి మోసం చేసేవారిపైన చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సొంత మనుషులే మాయమాటలు చెప్పి అత్యాచారాలకు పాల్పడుతున్నారని, కంటిపాపే కాటేస్తుంటే చిన్నారులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు.
ఏ వయసు మహిళలనైనా మోసం చేసే వారిని ఉపేక్షించడం లేదని వారిపై ఫిర్యాదు అందిన వేంటనే కేసులు నమోదు చేస్తున్నామని విచారణ కూడా వేగంగా జరుపుతున్నామని నిజామాబాద్ ఏసీపీ తెలిపారు. తమ పరిధిలో నమోదైన కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.. వారందరిపైనా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసామని ఏసీపీ పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని, విచారణ జరుపుతున్నసమయంలో బాధిత మైనర్ లు చెప్తున్న విషయాలు వింటుంటే బాధ కలిగిస్తుందని ఏసీపీ అన్నారు. ఘటనలు చోటుచేసుకున్న తరువాత మైనర్ లు మానసికంగా కుంగిపోతున్నారని… షీ టీం ద్వారా, సఖీ సెంటర్ లో గైడెన్స్ ఇవ్వడం ద్వారా బాధితుల్లో మానసిక స్టయిర్యం కలిగిస్తున్నామని అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2026 Playoffs Scenario: కేకేఆర్ సెన్సేషనల్ విక్టరీ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరం, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..