Nitish Kumar: 15 ఏళ్ల వయసులో కాలు కోల్పోయి.. స్వర్ణ విజేత నితీష్ కుమార్ కథ
- పారాలింపిక్స్ 2024లో భారత్ కు మరో బంగారు పతకం
- స్వర్ణ విజేత నితీష్ కుమార్
- 15 ఏళ్ల వయసులో ప్రమాదంలో కాలు కోల్పోయిన నితీష్ కథ ఇదే..
పారాలింపిక్స్ 2024లో బంగారు పతకం సాధించడం ద్వారా నితీష్ కుమార్ తన కలను నెరవేర్చుకున్నాడు. పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్కు ఇది రెండో స్వర్ణం. నితీష్ చరిత్రాత్మక ప్రదర్శనతో భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 8 పతకాలు చేరాయి. దీంతో పతకాల పట్టికలో భారత్ 22వ స్థానానికి చేరుకుంది. ఈ గేమ్స్లో భారత్ ప్లేయర్స్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించారు. పారా షూటర్ అవనీ లేఖరా పారాలింపిక్ గేమ్స్ 2024లో భారత్కు తొలి స్వర్ణం అందించింది.
READ MORE: Kolkata Doctor Case: ఒక్క వ్యక్తి 41 మంది పోలీసుల్ని గాయపరిచాడా..? మమతా సర్కార్ పరువు పాయే..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
పారాలింపిక్ గేమ్స్ 2024లో పురుషుల SL-3 విభాగంలో నితీష్ కుమార్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను గ్రేట్ బ్రిటన్కు చెందిన డేనియల్ బెతెల్ను ఓడించాడు. నితీష్ కుమార్, డేనియల్ బేతాల్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీలో ఒక్కో పాయింట్ కోసం గట్టిపోటీ నెలకొంది. చివరికి ఈ మ్యాచ్ 21-14, 18-21, 23-21తో నితీష్ కుమార్ కైవసం చేసుకున్నాడు. డేనియల్ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.
READ MORE:Meta AI: ఆత్మహత్యకుమందు యువతి సోషల్ మీడియాలో పోస్ట్.. పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన మెటా ఏఐ
15 ఏళ్ల వయసులో ప్రమాదంలో కాలు కోల్పోయిన నితీష్ కుమార్ పారాలింపిక్స్లో అద్భుతం సాధించాడు. కానీ ఈ విజయం సాధించడం వెనుక అతను ఎదుర్కొన్న పోరాటం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నితీష్కు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, 2009లో రైలు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. చాలా కాలం మంచానికే పరిమితమయ్యాడు. తన తండ్రి నేవీలో అధికారి. తన తండ్రిలాగే నేవీ యూనిఫాం ధరించాలన్నది నితీష్ కల. కానీ ఓ ప్రమాదం అతని కలను విచ్ఛిన్నం చేసింది.
కానీ నితీష్ ఓడిపోలేదు. కష్టాలపై పోరాడారు. అలాగే చదువు పూర్తి చేశాడు. ఐఐటీ-మండిలో చదువుతున్నప్పుడు పారా బ్యాడ్మింటన్ గురించిన సమాచారం వచ్చింది. అప్పుడు ఈ ఆట అతని బలానికి మూలమైంది. ఈ రోజు ఈ గేమ్ అతని పేరును దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చేసింది. నితీష్ కుమార్ విజయంతో, ఎస్ఎల్ 3 (SL3) విభాగంలో స్వర్ణ పతకం భారత్కు దక్కింది. టోక్యో పారాలింపిక్స్లో ప్రమోద్ భగత్ ఈ ఈవెంట్లో స్వర్ణం సాధించాడు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!