AC Truck Cabins: ట్రక్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. లారీలో తప్పనిసరిగా అది ఉండాల్సిందే

Nitin Gadkari

Nitin Gadkari

AC Truck Cabins: ఎండాకాలం, చలికాలం, వానల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు పెద్ద ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక చర్య తీసుకుంది. దీని కారణంగా వారు ఆనందంగా డ్రైవ్ చేయగలుగుతారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ 2025 నుండి అన్ని ట్రక్కు క్యాబిన్‌లను తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ (AC) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనివల్ల డ్రైవర్లు సులువుగా డ్రైవింగ్ చేయడంతోపాటు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

కంపెనీలు ట్రక్కుల ధరలను పెంచాయని కొంతకాలంగా ప్రజలకు ఫిర్యాదులు వస్తున్నాయని, అయినప్పటికీ క్యాబిన్‌లో ఏసీ సౌకర్యం కల్పించడం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. ట్రక్ డ్రైవర్ క్యాబిన్‌లో ఏసీ ట్రక్ క్యాబిన్‌లను తప్పనిసరి చేసే ఫైల్‌పై తాను ఈ రోజు సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. వేసవి, చలి, వాన సమయాల్లో ట్రక్కు డ్రైవర్లు పగలు, రాత్రుళ్లు డ్రైవింగ్ చేస్తారు.. అయితే వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ట్రక్కు పరిశ్రమను అప్‌గ్రేడ్ చేయడానికి 18 నెలల గడువు ఇచ్చారు.

Read Also:Covid Vaccine: రెండు వారాల్లో తేలనున్న కోవిడ్ వ్యాక్సిన్‌, గుండెపోటుకు మధ్య సంబంధం

ట్రక్కు ధర ఎంత?
వోల్వో , స్కానియా వంటి బహుళజాతి కంపెనీలు ఇప్పటికే ఎయిర్ కండిషన్డ్ క్యాబిన్‌లతో ట్రక్కులను తయారు చేస్తున్నాయి. గతంలో కొన్ని కంపెనీలు ఏసీని అమర్చేందుకు ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు 2025 నాటికి అన్ని ట్రక్కులకు ఏసీ ఉండాలని కేంద్ర మంత్రి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఈ ఉత్తర్వు తర్వాత ట్రక్కులను తయారు చేసే కంపెనీలు ఏసీ క్యాబిన్‌లను ఏర్పాటు చేస్తే ఒక్కో ట్రక్కుకు అదనంగా రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు అవుతుంది.

రోడ్డు పక్కన సౌకర్యాలు
జాతీయ రహదారులపై రోడ్ల పక్కన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ 570 రోడ్ సైడ్ ఫెసిలిటేషన్ కేంద్రాలపై పని చేస్తోంది. వీటిలో 170 టెండర్లు దాఖలయ్యాయి, పనులు కూడా ప్రారంభమయ్యాయి. హైవేకి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫెసిలిటీ సెంటర్‌ చేయడమే తమ లక్ష్యమని గడ్కరీ చెప్పారు.

Read Also:Nidhi Agarwal : టెంప్టింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..